ETV Bharat / international

కరోనా బాధితుల్లో చాలా మంది మృతికి ఇదే కారణం!

author img

By

Published : Apr 11, 2020, 4:08 PM IST

కరోనా బాధితుల్లో వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించటంలో ఆలస్యం కారణంగా ఎక్కువమంది మరణించినట్లు తెలుస్తోంది. చైనా ఆసుపత్రుల్లో చికిత్స విధానంపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. 20శాతం మందికే వెంటిలేటర్ సదుపాయం కల్పించారని తెలిపారు.

ventilator
వెంటిలేటర్

కరోనా వైరస్ వల్ల మృతి చెందిన బాధితుల్లో ఐదో వంతు మందికి మాత్రమే వెంటిలేటర్ సదుపాయం అందినట్లు తెలుస్తోంది. చైనాలో కరోనా బాధితుల చికిత్స విధానంపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ పరిశోధన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్​లో ప్రచురితమైంది. వుహాన్​లోని 21 ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేశారు పరిశోధకులు.

రోగుల్లో 33 శాతం మందికి..

మూడో వంతు రోగులకు మాత్రమే వెంటిలేషన్ సదుపాయం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కరోనా బాధితులకు కృత్రిమ శ్వాస అందించటంలో ఆలస్యం జరిగిందని అంచనాకు వచ్చారు. ఫలితంగా మరణాలు ఎక్కువగా సంభవించినట్లు తెలిపారు.

ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలనూ వివరించారు పరిశోధకులు.

  • రక్తంలో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్న కొంతమంది రోగులకు శ్వాసలో ఇబ్బందులు లేదా డిస్నియా వంటి లక్షణాలు లేకపోవటం.
  • కృత్రిమ శ్వాస అందించేందుకు వెంటిలేటర్లు కూడా తగినంత సంఖ్యలో లేకపోవటం.
  • వైద్య బృందాల్లో సీనియర్ల కొరత మరో ముఖ్య కారణం. ఫలితంగా రోగికి కృత్రిమ శ్వాస అవసరమో కాదో వైద్యులు నిర్ధరించలేకపోయారు.

కరోనా వల్ల చనిపోయిన రోగుల్లో ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు లక్షణాలు కనిపించినట్లు ఈ అధ్యయనం గుర్తించింది.

ఇదీ చూడండి: భౌతిక దూరం లక్ష్యంతో 'బ్లూటూత్ స్టెతస్కోప్' ఆవిష్కరణ

కరోనా వైరస్ వల్ల మృతి చెందిన బాధితుల్లో ఐదో వంతు మందికి మాత్రమే వెంటిలేటర్ సదుపాయం అందినట్లు తెలుస్తోంది. చైనాలో కరోనా బాధితుల చికిత్స విధానంపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ పరిశోధన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్​లో ప్రచురితమైంది. వుహాన్​లోని 21 ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేశారు పరిశోధకులు.

రోగుల్లో 33 శాతం మందికి..

మూడో వంతు రోగులకు మాత్రమే వెంటిలేషన్ సదుపాయం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కరోనా బాధితులకు కృత్రిమ శ్వాస అందించటంలో ఆలస్యం జరిగిందని అంచనాకు వచ్చారు. ఫలితంగా మరణాలు ఎక్కువగా సంభవించినట్లు తెలిపారు.

ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలనూ వివరించారు పరిశోధకులు.

  • రక్తంలో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్న కొంతమంది రోగులకు శ్వాసలో ఇబ్బందులు లేదా డిస్నియా వంటి లక్షణాలు లేకపోవటం.
  • కృత్రిమ శ్వాస అందించేందుకు వెంటిలేటర్లు కూడా తగినంత సంఖ్యలో లేకపోవటం.
  • వైద్య బృందాల్లో సీనియర్ల కొరత మరో ముఖ్య కారణం. ఫలితంగా రోగికి కృత్రిమ శ్వాస అవసరమో కాదో వైద్యులు నిర్ధరించలేకపోయారు.

కరోనా వల్ల చనిపోయిన రోగుల్లో ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు లక్షణాలు కనిపించినట్లు ఈ అధ్యయనం గుర్తించింది.

ఇదీ చూడండి: భౌతిక దూరం లక్ష్యంతో 'బ్లూటూత్ స్టెతస్కోప్' ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.