ETV Bharat / international

ట్రంప్​ X బైడెన్​: వాణిజ్యంలో భారత్​ ఎంపిక ఎవరు​?

author img

By

Published : Sep 6, 2020, 2:59 PM IST

భారత్​-అమెరికా మధ్య బలమైన వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఏటా ఇరుదేశాల మధ్య దాదాపు 142 బిలియన్​ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. అయితే ఇమిగ్రేషన్​, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల్లో మాత్రం ఇరుదేశాలకు ఇంకా కొన్ని విభేదాలు ఉన్నాయి. నవంబర్​లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అందులో ట్రంప్​ లేదా బైడెన్​లో ఎవరు అధ్యక్షుడైతే భారత్​కు మంచిదో ఓసారి చూద్దాం...

IndoUS Trade & Economy: The Better Choice for India- Trump Or Biden?
వాణిజ్యంలో భారత్​ ఎంపిక ఎవరు.. ట్రంప్​ లేదా బైడెన్​?
వాణిజ్యంలో భారత్​ ఎంపిక ఎవరు.. ట్రంప్​ లేదా బైడెన్​?

ప్రస్తుతం భారత్​-అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ అంశాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. ఏటా దాదాపు 142 బిలియన్​ డాలర్ల మేర వాణిజ్యం జరుగుతోంది. అయితే ఇమిగ్రేషన్​, కొన్ని ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల్లో మాత్రం ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్​ భారత పర్యటనలో వాటికి చెక్​ పడుతుందని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు.

యూఎస్‌ఐఎస్‌పీఎఫ్(యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం) ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశం అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలకు ముందు పరిమిత వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయొచ్చని ప్రకటించారు.

ఈ అంశాలన్నింటిపై సీనియర్​ జర్నలిస్ట్​ స్మితాశర్మ కొందరు నిపుణులతో చర్చించారు. భారత్​ ఎదుర్కొంటున్న వాణిజ్య, ఆర్థిక సవాళ్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

" రాబోయే నెలల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేను. కానీ అమెరికా.. భారత్​కు జీఎస్​పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్) స్టేటస్​ తిరిగి ఇవ్వగలదు. అది 6-8 బిలియన్ డాలర్లు ఉంటుంది. రాబోయే నెల లేదా రెండు నెలల్లో అధ్యక్షుడు దీనిపై సంతకం చేయవచ్చు. ఇది ఒక చిన్న ఒప్పందంలాగా ఉంటుంది.పెద్ద వాణిజ్య ఒప్పందానికి సమస్యలు ఉన్నాయి. భారత్​, అమెరికా జాతీయవాద, రక్షణవాదులు. సుంకాల రాజు అని పిలిచే అగ్రరాజ్యంతో అమెరికా ఫస్ట్​ అనే విధానాలు పెట్టుకుంటే భారత్​కు ఇబ్బంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య వ్యవసాయ రాయితీలు, మేధో సంపత్తి హక్కులు వంటి అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రెండు నెలల్లో అమెరికన్ అధ్యక్షుడు వాటిని పరిష్కరించడం కష్టం. తర్వాతి ప్రభుత్వం బైడెన్ లేదా ట్రంప్​దో తెలియదు. కానీ ఒకరివైపు మొగ్గు చూపడం భారత్​కు కచ్చితంగా మంచిది కాదు"

-- డాక్టర్​ అపర్ణా పాండే, హడ్సన్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​

2021 తొలి త్రైమాసికంలో భారత్​-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డారు ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేసిన మోహన్ కుమార్.

" చైనా, భారత్​ను.. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించాలని అనుకోవట్లేదు. కానీ చైనాను, భారత్​ను కలిపి ఒకేలా పోల్చడం న్యాయం కాదనేది మన వాదన. చైనా 13 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే భారత్ ఆర్థిక వ్యవస్థ​ 2.7 ట్రిలియన్​ డాలర్లు మాత్రమే. ఈ విషయాన్నే వచ్చే ప్రభుత్వానికి మనం గట్టిగా చెప్పాలి. మత్స్య సంపద విషయంలోనూ రాబోయే బహుపాక్షిక చర్చల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థితిని తిరిగి పొందాలి. మన దేశాన్ని చైనాతోనే పోలిస్తే డబ్ల్యూటీఓలో చర్చలు జరపలేము. కాబట్టి దీనిపై చాలా దృష్టిపెట్టాల్సి ఉంది.

డిజిటల్​ సేవల పన్ను విధించినందుకు ఫ్రాన్సపై శిక్షణాత్మక సుంకాలను విధించడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. మనం కూడా విదేశీ ఈ-కామర్స్​ కంపెనీలపై అలాంటి తరహా పన్నులు వేయడం వల్ల ఫ్రాన్స్​లాగే మనం సుంకాలు ఎదుర్కొనే జాబితాలో ఉన్నాం. అయితే గూగుల్​, అమెజాన్​ వంటి సంస్థలు లక్ష్యం కాదని అమెరికాకు భారత్​ వివరించగలగాలి. దీనిపై వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్నా"

--మోహన్ కుమార్, భారత మాజీ రాయబారి

ట్రంప్‌తో పోల్చితే జో బైడెన్ పరిపాలన.. ఇంధనం, వాణిజ్యం,ఇమిగ్రేషన్​ విషయాల్లో భారత్‌కు మేలు చేసేలా ఉంటుందా? అని నిపుణులు చర్చించారు.

" ట్రంప్​ ఈసారి అధికారంలోకి వస్తే మరో నాలుగేళ్లు మాత్రమే ఆయన తన పదవిలో ఉంటారు. ఆ తర్వాత పోటీ చేయడానికి వీలుండదు. ఆయన ఇమ్రిగ్రేషన్​ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. హెచ్​1బీ, ఎల్​1, గ్రీన్​ కార్డులు, స్టూడెంట్​ వీసాలు మరింత కఠినతరం అయ్యే ఛాన్స్​ ఉంది. ఇది భారత్​పై బాగా ప్రభావం చూపొచ్చు. ఇది విదేశీ విద్యపైనే కాకుండా విదేశీ నిధుల రాకపైనా ప్రభావం చూపుతుంది"

-- డాక్టర్​ అపర్ణా పాండే, హడ్సన్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​

బైడెన్​ అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్​ విషయంలో సమస్యలు సద్దుమణిగినా.. పలు సమస్యలు ఉన్నాయని మోహన్​ చెప్పుకొచ్చారు.

"బైడెన్ అధికారంలోకి వస్తే భారత్​కు పలు సమస్యలు రావొచ్చ. డబ్ల్యూటీఓలో సభ్యత్వం పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్​కు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. భారత్​కు జీఎస్​పీ తిరిగి ఇవ్వనని చెప్పేయొచ్చు. వీటితో పాటు కార్మిక ప్రమాణాలు, పర్యావరణ ప్రమాణాలను కఠినతరంగా మార్చే అవకాశం ఉంది".

--మోహన్ కుమార్, భారత మాజీ రాయబారి

వాణిజ్యంలో భారత్​ ఎంపిక ఎవరు.. ట్రంప్​ లేదా బైడెన్​?

ప్రస్తుతం భారత్​-అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ అంశాల్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బాగానే కొనసాగుతున్నాయి. ఏటా దాదాపు 142 బిలియన్​ డాలర్ల మేర వాణిజ్యం జరుగుతోంది. అయితే ఇమిగ్రేషన్​, కొన్ని ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల్లో మాత్రం ఇంకా సమస్యలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్​ భారత పర్యటనలో వాటికి చెక్​ పడుతుందని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు.

యూఎస్‌ఐఎస్‌పీఎఫ్(యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం) ఇటీవల నిర్వహించిన వార్షిక సమావేశం అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలకు ముందు పరిమిత వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాలు సంతకం చేయొచ్చని ప్రకటించారు.

ఈ అంశాలన్నింటిపై సీనియర్​ జర్నలిస్ట్​ స్మితాశర్మ కొందరు నిపుణులతో చర్చించారు. భారత్​ ఎదుర్కొంటున్న వాణిజ్య, ఆర్థిక సవాళ్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

" రాబోయే నెలల్లో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేను. కానీ అమెరికా.. భారత్​కు జీఎస్​పీ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్) స్టేటస్​ తిరిగి ఇవ్వగలదు. అది 6-8 బిలియన్ డాలర్లు ఉంటుంది. రాబోయే నెల లేదా రెండు నెలల్లో అధ్యక్షుడు దీనిపై సంతకం చేయవచ్చు. ఇది ఒక చిన్న ఒప్పందంలాగా ఉంటుంది.పెద్ద వాణిజ్య ఒప్పందానికి సమస్యలు ఉన్నాయి. భారత్​, అమెరికా జాతీయవాద, రక్షణవాదులు. సుంకాల రాజు అని పిలిచే అగ్రరాజ్యంతో అమెరికా ఫస్ట్​ అనే విధానాలు పెట్టుకుంటే భారత్​కు ఇబ్బంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య వ్యవసాయ రాయితీలు, మేధో సంపత్తి హక్కులు వంటి అనేక అంశాల్లో సమస్యలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రెండు నెలల్లో అమెరికన్ అధ్యక్షుడు వాటిని పరిష్కరించడం కష్టం. తర్వాతి ప్రభుత్వం బైడెన్ లేదా ట్రంప్​దో తెలియదు. కానీ ఒకరివైపు మొగ్గు చూపడం భారత్​కు కచ్చితంగా మంచిది కాదు"

-- డాక్టర్​ అపర్ణా పాండే, హడ్సన్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​

2021 తొలి త్రైమాసికంలో భారత్​-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కుదరకపోవచ్చని అభిప్రాయపడ్డారు ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేసిన మోహన్ కుమార్.

" చైనా, భారత్​ను.. అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించాలని అనుకోవట్లేదు. కానీ చైనాను, భారత్​ను కలిపి ఒకేలా పోల్చడం న్యాయం కాదనేది మన వాదన. చైనా 13 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉంటే భారత్ ఆర్థిక వ్యవస్థ​ 2.7 ట్రిలియన్​ డాలర్లు మాత్రమే. ఈ విషయాన్నే వచ్చే ప్రభుత్వానికి మనం గట్టిగా చెప్పాలి. మత్స్య సంపద విషయంలోనూ రాబోయే బహుపాక్షిక చర్చల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల స్థితిని తిరిగి పొందాలి. మన దేశాన్ని చైనాతోనే పోలిస్తే డబ్ల్యూటీఓలో చర్చలు జరపలేము. కాబట్టి దీనిపై చాలా దృష్టిపెట్టాల్సి ఉంది.

డిజిటల్​ సేవల పన్ను విధించినందుకు ఫ్రాన్సపై శిక్షణాత్మక సుంకాలను విధించడానికి ప్రయత్నిస్తోంది అమెరికా. మనం కూడా విదేశీ ఈ-కామర్స్​ కంపెనీలపై అలాంటి తరహా పన్నులు వేయడం వల్ల ఫ్రాన్స్​లాగే మనం సుంకాలు ఎదుర్కొనే జాబితాలో ఉన్నాం. అయితే గూగుల్​, అమెజాన్​ వంటి సంస్థలు లక్ష్యం కాదని అమెరికాకు భారత్​ వివరించగలగాలి. దీనిపై వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్నా"

--మోహన్ కుమార్, భారత మాజీ రాయబారి

ట్రంప్‌తో పోల్చితే జో బైడెన్ పరిపాలన.. ఇంధనం, వాణిజ్యం,ఇమిగ్రేషన్​ విషయాల్లో భారత్‌కు మేలు చేసేలా ఉంటుందా? అని నిపుణులు చర్చించారు.

" ట్రంప్​ ఈసారి అధికారంలోకి వస్తే మరో నాలుగేళ్లు మాత్రమే ఆయన తన పదవిలో ఉంటారు. ఆ తర్వాత పోటీ చేయడానికి వీలుండదు. ఆయన ఇమ్రిగ్రేషన్​ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. హెచ్​1బీ, ఎల్​1, గ్రీన్​ కార్డులు, స్టూడెంట్​ వీసాలు మరింత కఠినతరం అయ్యే ఛాన్స్​ ఉంది. ఇది భారత్​పై బాగా ప్రభావం చూపొచ్చు. ఇది విదేశీ విద్యపైనే కాకుండా విదేశీ నిధుల రాకపైనా ప్రభావం చూపుతుంది"

-- డాక్టర్​ అపర్ణా పాండే, హడ్సన్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​

బైడెన్​ అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్​ విషయంలో సమస్యలు సద్దుమణిగినా.. పలు సమస్యలు ఉన్నాయని మోహన్​ చెప్పుకొచ్చారు.

"బైడెన్ అధికారంలోకి వస్తే భారత్​కు పలు సమస్యలు రావొచ్చ. డబ్ల్యూటీఓలో సభ్యత్వం పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్​కు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉంది. భారత్​కు జీఎస్​పీ తిరిగి ఇవ్వనని చెప్పేయొచ్చు. వీటితో పాటు కార్మిక ప్రమాణాలు, పర్యావరణ ప్రమాణాలను కఠినతరంగా మార్చే అవకాశం ఉంది".

--మోహన్ కుమార్, భారత మాజీ రాయబారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.