అల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అమెరికా ఉగ్రవ్యతిరేక దళాలు జరిపిన ఆపరేషన్లో హమ్జాను మట్టుబెట్టినట్లు స్పష్టంచేశారు.
అయితే ఆపరేషన్ జరిగిన కచ్చితమైన ప్రాంతాన్ని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొనలేదు.
హమ్జా పేరుతో 2018లో చివరి ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనలో సౌదీ అరేబియాను బెదిరించాడు హమ్జా. అరేబియన్ ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చాడు. హమ్జాకు ఉన్న సౌదీ పౌరసత్వాన్ని ఈ ఏడాది మార్చిలో ఆ దేశం రద్దు చేసింది.