ETV Bharat / international

'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఉద్దీపన ప్యాకేజీ!

author img

By

Published : Feb 13, 2021, 4:59 AM IST

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక, ట్రైబల్ ప్రభుత్వాలకు భారీ మొత్తం ప్యాకేజీ ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ మేరకు పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లలో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు.

Governors and mayors need USD 350 billion
'రాష్ట్రాలకు 350 బిలియన్ల ఆర్థిక ప్యాకేజీ'

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లతో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. 1.9 ట్రిలియన్​ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 350 బిలియన్​ డాలర్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఇంత మొత్తం ఆర్థిక సాయం అందించడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్​లోని రిపబ్లికన్లు నిరాకరించినా.. కొంత మంది గవర్నర్లు, మేయర్లు ఇందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన నిధులే ఇప్పటివరకు ఖర్చు కాలేదని కొందరు రిపబ్లికన్ నేతలు ఆరోపించారు.

కానీ, గతేడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రాలు 3,32,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించాయని, స్థానిక ప్రభుత్వాలు దాదాపు 1 మిలియన్​ ఉద్యోగాలకు ఉద్వాసన పలికినట్లు బ్యూరో ఆఫ్​ లేబర్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బైడెన్​ నిర్ణయం కీలకంగా మారింది. కొత్తగా స్థానిక ప్రభుత్వాలకు 130.2 బిలియన్​ డాలర్లు, ట్రైబల్ ప్రభుత్వానికి 20 బిలియన్​ డాలర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:స్పుత్నిక్‌ టీకాకు 26 దేశాల ఆమోదం‌!

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలు రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లతో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు. 1.9 ట్రిలియన్​ డాలర్ల కరోనా ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా 350 బిలియన్​ డాలర్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

ఇంత మొత్తం ఆర్థిక సాయం అందించడం సరైన నిర్ణయం కాదని కాంగ్రెస్​లోని రిపబ్లికన్లు నిరాకరించినా.. కొంత మంది గవర్నర్లు, మేయర్లు ఇందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన నిధులే ఇప్పటివరకు ఖర్చు కాలేదని కొందరు రిపబ్లికన్ నేతలు ఆరోపించారు.

కానీ, గతేడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రాలు 3,32,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించాయని, స్థానిక ప్రభుత్వాలు దాదాపు 1 మిలియన్​ ఉద్యోగాలకు ఉద్వాసన పలికినట్లు బ్యూరో ఆఫ్​ లేబర్ గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బైడెన్​ నిర్ణయం కీలకంగా మారింది. కొత్తగా స్థానిక ప్రభుత్వాలకు 130.2 బిలియన్​ డాలర్లు, ట్రైబల్ ప్రభుత్వానికి 20 బిలియన్​ డాలర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:స్పుత్నిక్‌ టీకాకు 26 దేశాల ఆమోదం‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.