అమెరికా అధ్యక్ష పోరు విజేత జో బైడెన్కు జార్జీయా సెనేట్ ఎన్నికలు ఎంతో కీలకం. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సునామీ అనంతరం అగ్రరాజ్య రాజకీయాలు ఎలా ఉండనున్నాయనేదీ ఈ ఎన్నికలతో తేలిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి.
అధ్యక్ష పోరు అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలపై ట్రంప్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. బైడెన్ గెలుపుపై విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్. ఇది జార్జియాలోని రిపబ్లికన్ మద్దతుదారులపైనా ప్రభావం చూపించింది. అయితే మూడొంతుల రిపబ్లికన్ పార్టీ ఓటర్లు.. అధ్యక్ష ఎన్నికల్లో నిజంగానే అవకతవకలు జరిగాయని విశ్వసిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది.
ఇదీ చూడండి:- ట్రంప్ ఫ్యాన్స్ దెబ్బకు మోత మోగిపోయింది!
అగ్రరాజ్యంలోని వివిధ అంశాలపై ఏపీఓట్కాస్ట్ ఈ సర్వే చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగలేదని 10లో 9మంది రిపబ్లికన్ ఓటర్లు భావిస్తున్నట్టు సర్వే పేర్కొంది. ఫలితంగా.. ట్రంప్ వాదనను ఏకీభవించే వారి సంఖ్య.. నవంబర్ తర్వాత నుంచి ఐదు రేట్లు పెరిగడం గమనార్హం.
మరోవైపు రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. వేలాది మంది ఆయన ర్యాలీలకు తరలివెళుతున్నారు. జార్జీయాలోని రిపబ్లికన్ సెనేటర్ కన్నా ట్రంప్కే ఆదరణ ఎక్కువ ఉంది.
ఇదీ చూడండి- పదవి కోసం ఎంతకైనా పోరాడతా: ట్రంప్