ETV Bharat / international

'కరోనాపై చైనా చెప్పేవన్నీ కట్టుకథలే!'

author img

By

Published : Mar 26, 2020, 8:22 AM IST

కరోనా వైరస్​ వ్యాప్తిపై చైనా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని.. జీ-7 దేశాలు అన్నింటికీ ఈ విషయం తెలుసని అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో అన్నారు.

G7 powers agree China spreading 'disinformation': Pompeo
చైనా గురించి జీ-7 దేశాలకు అంతా తెలుసు: పాంపియో

ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ పాపం చైనాదేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే విధంగా చైనా ప్రచారం చేస్తోందని జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో విమర్శించారు.

చైనా గురించి జీ-7 దేశాలకు అంతా తెలుసు: పాంపియో

"సమావేశంలో పాల్గొన్న ప్రతి జీ7 దేశానికి.... 'చైనా తన దేశంలో పుట్టిన కరోనా (వుహాన్​) వైరస్​ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని' బాగా తెలుసు."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి

కరోనా భయాలతో ఇంతకుముందు పిట్స్​బర్గ్​లో జరగాల్సిన ఈ సమావేశాన్ని అమెరికా రద్దు చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా బుధవారం గ్రూప్ ఆఫ్ సెవెన్​ విదేశాంగ మంత్రులతో పాంపియో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్, చైనా సహా 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల (జీ-20 దేశాల) నాయకుల వీడియో కాన్ఫరెన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఒక్కరోజు ముందు జీ-7 చర్చలు జరగడం గమనార్హం.

కుట్ర పన్నుతోంది!

ఈ మహమ్మారి గురించి చైనా 'తప్పుడు సమాచారాన్ని' ప్రచారం చేస్తున్నట్లు జీ-7 దేశాలు అంగీకరించాయని పాంపియో పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు, శిథిలమైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించేందుకు బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్​ సహా ప్రపంచ దేశాలతో కలిసి తాము పనిచేస్తామని పాంపియో స్పష్టం చేశారు.

చైనా మాత్రం తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఈ నేరం అమెరికాపై మోపడానికి కుట్ర చేస్తోందని పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా మహానగరమైన వుహాన్​లోనే కరోనా వైరస్ పుట్టిందని ఆయన పేర్కొన్నారు.

చైనా సాయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని చైనా అదుపులోకి తీసుకురాగలిగింది. ఇటలీతో సహా యూఎస్ మిత్రదేశాలకు మాస్కులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తూ కరోనాను నియంత్రించేందుకు ఇతోధిక సహాయాన్ని అందిస్తోంది.

కుచ్చుటోపీ

ఇటలీకి చైనా సాయం చేయడాన్ని మైక్ పాంపియో తేలిగ్గా కొట్టిపారేశారు. ఇటలీ కరోనా బారి నుంచి గట్టెక్కేందుకు అవసరమైన సైనిక సాయాన్ని అందించేందుకు అమెరికా ప్రణాళిక ఖరారు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో చైనా తన ఉత్పత్తులను మెల్లగా అమ్ముకుంటోందని, ప్రపంచం నెత్తిన తెల్లటోపీ పెడుతోందని మైక్​ పాంపియో విమర్శించారు.

ఇదీ చూడండి: 5 కోట్ల మంది పేదలకు భాజపా ఉచిత భోజనం

ప్రపంచాన్ని కబళిస్తోన్న కరోనా వైరస్ పాపం చైనాదేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో మరోసారి ఆరోపణలు గుప్పించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించే విధంగా చైనా ప్రచారం చేస్తోందని జీ7 విదేశాంగ మంత్రుల సమావేశంలో విమర్శించారు.

చైనా గురించి జీ-7 దేశాలకు అంతా తెలుసు: పాంపియో

"సమావేశంలో పాల్గొన్న ప్రతి జీ7 దేశానికి.... 'చైనా తన దేశంలో పుట్టిన కరోనా (వుహాన్​) వైరస్​ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని' బాగా తెలుసు."

- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి

కరోనా భయాలతో ఇంతకుముందు పిట్స్​బర్గ్​లో జరగాల్సిన ఈ సమావేశాన్ని అమెరికా రద్దు చేసింది. అందుకు ప్రత్యామ్నాయంగా బుధవారం గ్రూప్ ఆఫ్ సెవెన్​ విదేశాంగ మంత్రులతో పాంపియో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్, చైనా సహా 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థల (జీ-20 దేశాల) నాయకుల వీడియో కాన్ఫరెన్స్ శిఖరాగ్ర సమావేశానికి ఒక్కరోజు ముందు జీ-7 చర్చలు జరగడం గమనార్హం.

కుట్ర పన్నుతోంది!

ఈ మహమ్మారి గురించి చైనా 'తప్పుడు సమాచారాన్ని' ప్రచారం చేస్తున్నట్లు జీ-7 దేశాలు అంగీకరించాయని పాంపియో పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు, శిథిలమైన ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించేందుకు బ్రిటన్​, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్​ సహా ప్రపంచ దేశాలతో కలిసి తాము పనిచేస్తామని పాంపియో స్పష్టం చేశారు.

చైనా మాత్రం తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఈ నేరం అమెరికాపై మోపడానికి కుట్ర చేస్తోందని పాంపియో ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా మహానగరమైన వుహాన్​లోనే కరోనా వైరస్ పుట్టిందని ఆయన పేర్కొన్నారు.

చైనా సాయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని చైనా అదుపులోకి తీసుకురాగలిగింది. ఇటలీతో సహా యూఎస్ మిత్రదేశాలకు మాస్కులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తూ కరోనాను నియంత్రించేందుకు ఇతోధిక సహాయాన్ని అందిస్తోంది.

కుచ్చుటోపీ

ఇటలీకి చైనా సాయం చేయడాన్ని మైక్ పాంపియో తేలిగ్గా కొట్టిపారేశారు. ఇటలీ కరోనా బారి నుంచి గట్టెక్కేందుకు అవసరమైన సైనిక సాయాన్ని అందించేందుకు అమెరికా ప్రణాళిక ఖరారు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సమయంలో చైనా తన ఉత్పత్తులను మెల్లగా అమ్ముకుంటోందని, ప్రపంచం నెత్తిన తెల్లటోపీ పెడుతోందని మైక్​ పాంపియో విమర్శించారు.

ఇదీ చూడండి: 5 కోట్ల మంది పేదలకు భాజపా ఉచిత భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.