ETV Bharat / international

టీకా తీసుకుంటే.. 94% ఆసుపత్రి ముప్పు తప్పినట్లే!

author img

By

Published : Apr 30, 2021, 4:47 AM IST

కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నవారికి ఆస్పత్రిలో చేరే ముప్పు తప్పినట్టేనని అమెరికన్​ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పూర్తిస్థాయిలో(రెండు డోసుల) టీకా తీసుకున్నవారు మరణం బారినపడే ప్రమాదం నుంచి కూడా రక్షణ పొందుతారని పరిశోధకులు తెలిపారు. అగ్రరాజ్యంలోని 14 రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల్లో సుమారు 400మందికిపైగా కొవిడ్​ రోగుల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం.. ఈ విషయాలను వెల్లడించారు శాస్త్రవేత్తలు. అధ్యయనంలో ఇంకా ఏయే విషయాలు వెలుగుచూశాయంటే..

Vaccination
కరోనా వ్యాక్సినేషన్​, కొవిడ్​ టీకా

కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా.. కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణం బారినపడే ప్రమాదం నుంచీ గట్టెక్కినట్లేనని పేర్కొంది.

అమెరికాలో వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్‌ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్‌ తీసుకున్న మరో 187 గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో(రెండు డోసులు) వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64 శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతున్న ఫైజర్‌, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా.. వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్‌ సత్ఫలితాలిస్తున్నట్లు తేలడం మనతోపాటు ఆసుపత్రులకు ఊరట కలిగించే విషయమని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్లే వాలెన్‌స్కై పేర్కొన్నారు. టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ సోకినా ఆసుపత్రుల్లో చేరాల్సినంత ప్రమాదం లేదనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. అందుకే కొవిడ్‌ రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రయత్నాలకు విస్తరిస్తూనే ఉంటామన్నారు. తద్వారా ఆసుపత్రి సిబ్బంది, పడకలు, ఇతర సదుపాయాలను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంచవచ్చని సీడీసీ చీఫ్‌ వాలెన్‌స్కై పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పేద దేశాల్లో టీకా పంపిణీపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన

ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ నివేదికల్లోనూ ఇవే ఫలితాలు..

కరోనా వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపే వాస్తవ ఫలితాల నివేదికలను ఇజ్రాయెల్‌ కూడా ఈ మధ్యే వెల్లడించింది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో 60 శాతానికిపైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన ఇజ్రాయెల్‌.. వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా వృద్ధులకు వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో గుర్తించింది. అయితే.. ప్రస్తుతం అక్కడ కేవలం ఫైజర్‌ టీకాను మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

ఇక బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలోనూ కరోనా వ్యాక్సిన్‌ ఒక డోసు తీసుకున్నా దాదాపు 50శాతం రక్షణ కలుగుతుందని తేలింది. ముఖ్యంగా ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారినపడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం.. బ్రిటన్‌లో పంపిణీ చేస్తోన్న ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌(పీహెచ్‌ఈ) అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వృద్ధులను రక్షించుకున్నట్లే.!

కరోనా వైరస్‌ మహమ్మారి వృద్ధుల్లోనే అత్యంత తీవ్రత చూపిస్తోంది. 65 ఏళ్ల తక్కువ వయసువారితో పోలిస్తే వృద్ధుల్లోనే 6 నుంచి 8శాతం కొవిడ్‌ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోత్పోతున్న వారిలో ఎక్కవ మంది 65 ఏళ్లు పైబడినవారే ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా అమెరికాలో ఇప్పటివరకు 65ఏళ్ల వయసుపైడిన వారిలో 65 శాతం(3.7కోట్ల) మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. అమెరికానే కాకుండా భారత్‌తోపాటు ఇతర దేశాల్లో టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం వృద్ధులకే ఇస్తున్నారు.

ఇదీ చదవండి: ఉష్ణోగ్రత పెరిగితే కరోనా ఖేల్‌ ఖతం!

కరోనా వ్యాక్సిన్‌ను పూర్తి మోతాదులో తీసుకున్నట్లయితే(రెండు డోసుల్లో) ఇక ఆసుపత్రి ముప్పు తప్పినట్లేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకుంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ముప్పు 94శాతం తప్పినట్లేనని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా.. కరోనా వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొని మరణం బారినపడే ప్రమాదం నుంచీ గట్టెక్కినట్లేనని పేర్కొంది.

అమెరికాలో వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు అక్కడి వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 14రాష్ట్రాల్లో 24 ఆసుపత్రుల్లోని 417 మంది కొవిడ్‌ రోగుల సమాచారాన్ని విశ్లేషించింది. వీటిని వ్యాక్సిన్‌ తీసుకున్న మరో 187 గ్రూపు వారితో పోల్చి చూసింది. తద్వారా పూర్తి మోతాదులో(రెండు డోసులు) వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 94శాతం తగ్గిందని గుర్తించింది. ఇక ఒక డోసు తీసుకున్న వారిలో 64 శాతం ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం తగ్గినట్లు సీడీసీ పేర్కొంది. దీంతో ప్రస్తుతం అమెరికాలో పంపిణీ అవుతున్న ఫైజర్‌, మోడెర్నా టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు మరోసారి నిరూపితమయ్యాయని సీడీసీ అభిప్రాయపడింది. అంతేకాకుండా.. వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు వారాల తర్వాతే శరీరం పూర్తిస్థాయిలో రోగనిరోధకత ప్రతిస్పందనలను కలిగి ఉంటున్నట్లు సీడీసీ పేర్కొంది.

కరోనా వ్యాక్సిన్‌ సత్ఫలితాలిస్తున్నట్లు తేలడం మనతోపాటు ఆసుపత్రులకు ఊరట కలిగించే విషయమని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్లే వాలెన్‌స్కై పేర్కొన్నారు. టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి వైరస్‌ సోకినా ఆసుపత్రుల్లో చేరాల్సినంత ప్రమాదం లేదనే విషయం మరోసారి నిరూపితమైందన్నారు. అందుకే కొవిడ్‌ రోగులతో ఆసుపత్రులు నిండిపోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రయత్నాలకు విస్తరిస్తూనే ఉంటామన్నారు. తద్వారా ఆసుపత్రి సిబ్బంది, పడకలు, ఇతర సదుపాయాలను ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అందుబాటులో ఉంచవచ్చని సీడీసీ చీఫ్‌ వాలెన్‌స్కై పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పేద దేశాల్లో టీకా పంపిణీపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన

ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ నివేదికల్లోనూ ఇవే ఫలితాలు..

కరోనా వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపే వాస్తవ ఫలితాల నివేదికలను ఇజ్రాయెల్‌ కూడా ఈ మధ్యే వెల్లడించింది. ఇప్పటికే అక్కడి మొత్తం జనాభాలో 60 శాతానికిపైగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన ఇజ్రాయెల్‌.. వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా వృద్ధులకు వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో గుర్తించింది. అయితే.. ప్రస్తుతం అక్కడ కేవలం ఫైజర్‌ టీకాను మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

ఇక బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలోనూ కరోనా వ్యాక్సిన్‌ ఒక డోసు తీసుకున్నా దాదాపు 50శాతం రక్షణ కలుగుతుందని తేలింది. ముఖ్యంగా ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత మహమ్మారి బారినపడితే వారి నుంచి కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే ప్రమాదం 50 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. ప్రస్తుతం.. బ్రిటన్‌లో పంపిణీ చేస్తోన్న ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌(పీహెచ్‌ఈ) అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వృద్ధులను రక్షించుకున్నట్లే.!

కరోనా వైరస్‌ మహమ్మారి వృద్ధుల్లోనే అత్యంత తీవ్రత చూపిస్తోంది. 65 ఏళ్ల తక్కువ వయసువారితో పోలిస్తే వృద్ధుల్లోనే 6 నుంచి 8శాతం కొవిడ్‌ మరణాలు ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా నిపుణులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోత్పోతున్న వారిలో ఎక్కవ మంది 65 ఏళ్లు పైబడినవారే ఉంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా అమెరికాలో ఇప్పటివరకు 65ఏళ్ల వయసుపైడిన వారిలో 65 శాతం(3.7కోట్ల) మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసినట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. అమెరికానే కాకుండా భారత్‌తోపాటు ఇతర దేశాల్లో టీకా పంపిణీలో తొలి ప్రాధాన్యం వృద్ధులకే ఇస్తున్నారు.

ఇదీ చదవండి: ఉష్ణోగ్రత పెరిగితే కరోనా ఖేల్‌ ఖతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.