ETV Bharat / international

అమెరికాలో భారతీయ అమెరికన్లు పోటాపోటీగా ర్యాలీలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన భారతీయ అమెరికన్లు.. అధ్యక్షుడు డొనాల్డ్ ​ట్రంప్​నకు​, డెమోక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్​కు మద్దతుగా వేర్వురుగా ప్రచార ర్యాలీలు చేశారు. భారత్​కు సన్నిహితుడైన ట్రంప్​నకు ఓటు వేయాలని ట్రంప్ మద్దతుదారులు కోరగా.. మరోవైపు భవిష్యత్​ తరాలవారి కోసం బైడెన్​కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు.

author img

By

Published : Oct 19, 2020, 1:34 PM IST

For good relationship with India, vote for Trump: Indian-American supporters
అమెరికాలో భారతీయ అమెరికన్ల పోటాపోటీ ర్యాలీలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు నిర్వహించిన ర్యాలీలు చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు మద్దతుగా కొంతమంది భారతీయ అమెరికన్లు... డెమొక్రాటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్​​కు మద్దతుగా మరి కొంతమంది భారతీయ అమెరికన్లు వేర్వేరుగా ప్రచార ర్యాలీలు చేపట్టారు.

ట్రంప్ మద్దతుదారులు

భారత్​కు అత్యంత సన్నిహితుడైన అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్​ మొదటి వారని.. భారత్​-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి కృషి చేసిన ట్రంప్​నకు ఓటు వేయాలని ప్రచారం చేశారు ట్రంప్​ మద్దతుదారులు. మంచి ఆర్థిక వ్యవస్థ, తక్కువ పన్నులు, మంచి ప్రభుత్వం కావాలా? అయితే ట్రంప్​ను ఎన్నుకుందామని​ ర్యాలీలో పేర్కొన్నారు. 'భారతీయ అమెరికన్లు సంఖ్యలో తక్కువ కావచ్చు. కానీ సంపాదనలో శక్తిమంతంగా ఉన్నాం. అందుకే అందరు ఏకమై ట్రంప్​ను ఎన్నుకుందాం' అని ప్రచారం చేశారు.

బైడెన్​ మద్దతుదారులు

భవిష్యత్తు​ తరాలవారి కలలను సాకారం చేసుకోవాలంటే జో బైడెన్​ను దేశ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యరీస్​ను ఎన్నుకోవాలని మరికొంతమంది భారతీయ అమెరికన్లు గెట్​ ఔట్​ ది ఓట్​ (జీఓటీవీ) పేరుతో కాలిఫోర్నియాలో ప్రచార ర్యాలీ చేపట్టారు. 'హ్యారీస్​ ఎన్నికల్లో గెలుపొందితే... దేశ చరిత్రలో తొలి మహిళ ఉపాధ్యక్షురాలు అవుతారని... ఇది మనందరికి గర్వకారణం' అంటూ ప్రచారం చేశారు.

ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల్లో 'ఏపీ ఓట్​కాస్ట్​ ' అంచనాలు నిజమయ్యేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ అమెరికన్లు నిర్వహించిన ర్యాలీలు చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు మద్దతుగా కొంతమంది భారతీయ అమెరికన్లు... డెమొక్రాటిక్​ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్​​కు మద్దతుగా మరి కొంతమంది భారతీయ అమెరికన్లు వేర్వేరుగా ప్రచార ర్యాలీలు చేపట్టారు.

ట్రంప్ మద్దతుదారులు

భారత్​కు అత్యంత సన్నిహితుడైన అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్​ మొదటి వారని.. భారత్​-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఏర్పడటానికి కృషి చేసిన ట్రంప్​నకు ఓటు వేయాలని ప్రచారం చేశారు ట్రంప్​ మద్దతుదారులు. మంచి ఆర్థిక వ్యవస్థ, తక్కువ పన్నులు, మంచి ప్రభుత్వం కావాలా? అయితే ట్రంప్​ను ఎన్నుకుందామని​ ర్యాలీలో పేర్కొన్నారు. 'భారతీయ అమెరికన్లు సంఖ్యలో తక్కువ కావచ్చు. కానీ సంపాదనలో శక్తిమంతంగా ఉన్నాం. అందుకే అందరు ఏకమై ట్రంప్​ను ఎన్నుకుందాం' అని ప్రచారం చేశారు.

బైడెన్​ మద్దతుదారులు

భవిష్యత్తు​ తరాలవారి కలలను సాకారం చేసుకోవాలంటే జో బైడెన్​ను దేశ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యరీస్​ను ఎన్నుకోవాలని మరికొంతమంది భారతీయ అమెరికన్లు గెట్​ ఔట్​ ది ఓట్​ (జీఓటీవీ) పేరుతో కాలిఫోర్నియాలో ప్రచార ర్యాలీ చేపట్టారు. 'హ్యారీస్​ ఎన్నికల్లో గెలుపొందితే... దేశ చరిత్రలో తొలి మహిళ ఉపాధ్యక్షురాలు అవుతారని... ఇది మనందరికి గర్వకారణం' అంటూ ప్రచారం చేశారు.

ఇదీ చూడండి: అమెరికా ఎన్నికల్లో 'ఏపీ ఓట్​కాస్ట్​ ' అంచనాలు నిజమయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.