ETV Bharat / international

భారత్​లో కరోనాపై వివేక్​మూర్తి ఆందోళన

దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా సర్జన్ జనరల్ డా. వివేక్ మూర్తి. భారత్​లో బీ117 రకం కరోనా.. సాధారణ వైరస్​తో పోలిస్తే 50 శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాలన్నీ కొవిడ్​పై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

author img

By

Published : May 7, 2021, 8:49 AM IST

MURTHY india virus
భారత్​లో కరోనాపై వివేక్​మూర్తి ఆందోళన

భారత్​లో కరోనా రెండో దశ విషాదకరమని భారత సంతతికి చెందిన అమెరికా వైద్య నిపుణుడు డా. వివేక్ మూర్తి పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

"భారత్​లో ఉన్న పరిస్థితులు విషాదకరం. ఇది అమెరికాలో ఎదురుకాకుండా ఉంటే బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. భారత్​లో బీ117 రకం కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. సాధారణ వైరస్​తో పోలిస్తే 50శాతం అధికంగా ఇది వ్యాప్తి చెందుతోంది."

- డా. వివేక్ మూర్తి, అమెరికా సర్జన్ జనరల్

కొవిడ్ మనకు ఏదైనా నేర్పించిందంటే.. అది ఒకరికొకరు సాయంగా నిలబడటమేనని అన్నారు వివేక్ మూర్తి. ప్రపంచానికి టీకాలు అందే విధంగా దేశాలన్నీ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అందరికీ చికిత్స అందుబాటులో ఉంచాలని... ప్రపంచంలోని ఏ మూలనైనా కొవిడ్ ఉందంటే అది ప్రతి దేశానికీ ముప్పుగా పరిణమించినట్లేనని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మనోళ్లు భారత్​ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని

భారత్​లో కరోనా రెండో దశ విషాదకరమని భారత సంతతికి చెందిన అమెరికా వైద్య నిపుణుడు డా. వివేక్ మూర్తి పేర్కొన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

"భారత్​లో ఉన్న పరిస్థితులు విషాదకరం. ఇది అమెరికాలో ఎదురుకాకుండా ఉంటే బాగుంటుంది. కానీ, అలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. భారత్​లో బీ117 రకం కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. సాధారణ వైరస్​తో పోలిస్తే 50శాతం అధికంగా ఇది వ్యాప్తి చెందుతోంది."

- డా. వివేక్ మూర్తి, అమెరికా సర్జన్ జనరల్

కొవిడ్ మనకు ఏదైనా నేర్పించిందంటే.. అది ఒకరికొకరు సాయంగా నిలబడటమేనని అన్నారు వివేక్ మూర్తి. ప్రపంచానికి టీకాలు అందే విధంగా దేశాలన్నీ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. అందరికీ చికిత్స అందుబాటులో ఉంచాలని... ప్రపంచంలోని ఏ మూలనైనా కొవిడ్ ఉందంటే అది ప్రతి దేశానికీ ముప్పుగా పరిణమించినట్లేనని హెచ్చరించారు.

ఇదీ చదవండి: మనోళ్లు భారత్​ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.