ETV Bharat / international

అమెరికా-ఇరాన్​ మధ్య చైనా 'రాజీ' ఆస్త్రం - China urges US 'not to abuse force': Foreign Minister

ఇరాన్​తో సైనిక చర్యలతో కాకుండా.. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది చైనా. ఇదే విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి ఇరాన్​కు స్పష్టం చేశారు.

iran-china
అమెరికా ఇరాన్​ మధ్య రాజీకి చైనా ప్రయత్నం
author img

By

Published : Jan 5, 2020, 5:10 AM IST

అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్​ టాప్​ కమాండర్​ ఖాసీం సులేమానీ మట్టుబెట్టడం వల్ల ఇరాన్​తో తలెత్తిన వివాదానికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది చైనా. ఇరాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక దళాలను ఉపయోగించడం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికాను కోరింది. ఇదే విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​.. ఇరాన్​ విదేశాంగ మంత్రి జావద్​ జరీఫ్​తో ఫోన్​ సంభాషణలో స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

"అమెరికా అంతర్జాతీయ సంబంధాల నిబంధనలను ఉల్లంఘించి సైనిక చర్యలను ప్రయోగించింది. దీని వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేస్తుంది."

- ప్రకటన, చైనా విదేశాంగ కార్యాలయం.

అమెరికా, ఇరాన్​ల మధ్య నాలుగు దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు లేకపోవడం.... తాజాగా ఇరాన్​ రెండో అత్యున్నత నేత సులేమానీని యూఎస్ హతమార్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్​ చైనాతో సహా మిత్రదేశాలతో కలిసి తగిన రీతిలో ప్రతీకారం తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చర్చలు ద్వారానే ఇరాన్​తో సంధి కుదుర్చుకోవాలని చైనా అమెరికాను కోరింది.

ట్రంప్​కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?

అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్​ టాప్​ కమాండర్​ ఖాసీం సులేమానీ మట్టుబెట్టడం వల్ల ఇరాన్​తో తలెత్తిన వివాదానికి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది చైనా. ఇరాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక దళాలను ఉపయోగించడం కాకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికాను కోరింది. ఇదే విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​.. ఇరాన్​ విదేశాంగ మంత్రి జావద్​ జరీఫ్​తో ఫోన్​ సంభాషణలో స్పష్టం చేశారు. ఈ మేరకు చైనా విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

"అమెరికా అంతర్జాతీయ సంబంధాల నిబంధనలను ఉల్లంఘించి సైనిక చర్యలను ప్రయోగించింది. దీని వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం చేస్తుంది."

- ప్రకటన, చైనా విదేశాంగ కార్యాలయం.

అమెరికా, ఇరాన్​ల మధ్య నాలుగు దశాబ్దాలుగా దౌత్య సంబంధాలు లేకపోవడం.... తాజాగా ఇరాన్​ రెండో అత్యున్నత నేత సులేమానీని యూఎస్ హతమార్చిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్​ చైనాతో సహా మిత్రదేశాలతో కలిసి తగిన రీతిలో ప్రతీకారం తీసుకుంటానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చర్చలు ద్వారానే ఇరాన్​తో సంధి కుదుర్చుకోవాలని చైనా అమెరికాను కోరింది.

ట్రంప్​కే నేరుగా హెచ్చరికలు.. అసలు ఎవరీ సులేమానీ?

Nankana Sahib (Pakistan), Jan 04 (ANI): Pakistan is unlikely to allow Sikhs to take out 'Nagar Kirtan' as tension persists in Nankana Sahib, according to Pakistani media reports. Mob pelted stones on Gurdwara Nankana Sahib in Pakistan on Jan 03. India had strongly condemned vandalism at holy Sikh shrine.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.