ETV Bharat / international

'దక్షిణాసియాపై పెరుగుతున్న చైనా పట్టు' - చైనా ఇన్​ఫ్లూయెన్స్​ ఆన్ కాన్​ఫ్లిక్ట్ డైనమిక్స్ ఇన్ సౌత్​ ఏసియా

దక్షిణాసియా ప్రాంతంలో చైనా తన ఉనికిని పెంచుకుంటోందని ఓ నివేదికను విడుదల చేసింది అమెరికాకు చెందిన ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పీస్​. దీని వల్ల ఆ ప్రాంతంలో పోటీతత్వం పెరుగుతోందని పేర్కొంది. అయితే చైనా ఉనికిపై అమెరికా దృష్టిసారించాలని.. అప్పుడే ఆ ప్రాంతంలో తమ విధానాలు విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

China expanding role in South Asia and region to be more contested in coming decades reports US think tank
'దక్షిణాసియా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపనున్న చైనా'
author img

By

Published : Dec 17, 2020, 12:24 PM IST

దక్షిణాసియా వ్యవహారాల్లో చైనా తన పాత్రను పెంచుకుంటోందని.. ఇది ఆ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, భద్రతపై ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై దృష్టిసారిస్తేనే.. దక్షిణాసియా ప్రాంతంలో తమ విధానాలను విజయవంతంగా అమలు చేయడానికి అమెరికాకు ఆస్కారం ఉంటుందని తన నివేదికలో పేర్కొంది యూఎస్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పీస్​. చైనా ఉనికి పెరుగుతుండటం వల్ల ఆ ప్రాంతంలో పోటీతత్వం మెరుగుపడుతోందని పేర్కొంది.

ఈ 'చైనాస్​ ఇన్​ఫ్లుయెన్స్​ ఆన్​ కాన్​ఫ్లిక్ట్​ డైనమిక్స్​ ఇన్​ సౌత్​ ఏషియే స్టేట్ట్​' నివేదికను సీనియర్​ నిపుణులు, మాజీ విధానకర్తలు, విశ్రాంత దౌత్యవేత్తలు రూపొందించారు. చైనా ఉనికి వల్ల దక్షిణాసియాలో ఇప్పటికే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని వీరు నివేదికలో పేర్కొన్నారు. అమెరికా-చైనాలకు దక్షిణాసియా ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా అభివర్ణించారు. అయితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక పోరు వల్ల ఆ ప్రాంతంలో సహకారం క్లిష్టంగా మారుతుందని.. ముఖ్యంగా ఏదైనా సంక్షోభం తలెత్తితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

చైనా-పాకిస్థాన్​ సత్సంబంధాలు మరింత ధృడమైనట్లు పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. భారత్​- పాకిస్థాన్​ మధ్య వైరం కొనసాగుతోన్న నేపథ్యంలో చైనా వైఖరి... పాక్​కే అనుకూలంగా ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది. కశ్మీర్​ విషయంలో చైనా ప్రవర్తించిన తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. చైనా- భారత్​ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని.. అదే సమయంలో ఇరు దేశాల మధ్య పోటీతత్వం భారీగా పెరుగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:టీకాపై తప్పుడు ట్వీట్లు చేస్తే ఇక అంతే!

దక్షిణాసియా వ్యవహారాల్లో చైనా తన పాత్రను పెంచుకుంటోందని.. ఇది ఆ ప్రాంతం రాజకీయ, ఆర్థిక, భద్రతపై ప్రభావం చూపుతుందని అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై దృష్టిసారిస్తేనే.. దక్షిణాసియా ప్రాంతంలో తమ విధానాలను విజయవంతంగా అమలు చేయడానికి అమెరికాకు ఆస్కారం ఉంటుందని తన నివేదికలో పేర్కొంది యూఎస్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పీస్​. చైనా ఉనికి పెరుగుతుండటం వల్ల ఆ ప్రాంతంలో పోటీతత్వం మెరుగుపడుతోందని పేర్కొంది.

ఈ 'చైనాస్​ ఇన్​ఫ్లుయెన్స్​ ఆన్​ కాన్​ఫ్లిక్ట్​ డైనమిక్స్​ ఇన్​ సౌత్​ ఏషియే స్టేట్ట్​' నివేదికను సీనియర్​ నిపుణులు, మాజీ విధానకర్తలు, విశ్రాంత దౌత్యవేత్తలు రూపొందించారు. చైనా ఉనికి వల్ల దక్షిణాసియాలో ఇప్పటికే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని వీరు నివేదికలో పేర్కొన్నారు. అమెరికా-చైనాలకు దక్షిణాసియా ఎంతో ముఖ్యమైన ప్రాంతంగా అభివర్ణించారు. అయితే.. ఇరు దేశాల ద్వైపాక్షిక పోరు వల్ల ఆ ప్రాంతంలో సహకారం క్లిష్టంగా మారుతుందని.. ముఖ్యంగా ఏదైనా సంక్షోభం తలెత్తితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.

చైనా-పాకిస్థాన్​ సత్సంబంధాలు మరింత ధృడమైనట్లు పరిశోధనా సంస్థ అభిప్రాయపడింది. భారత్​- పాకిస్థాన్​ మధ్య వైరం కొనసాగుతోన్న నేపథ్యంలో చైనా వైఖరి... పాక్​కే అనుకూలంగా ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది. కశ్మీర్​ విషయంలో చైనా ప్రవర్తించిన తీరు ఇందుకు నిదర్శనమని తెలిపింది. చైనా- భారత్​ సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని.. అదే సమయంలో ఇరు దేశాల మధ్య పోటీతత్వం భారీగా పెరుగుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:టీకాపై తప్పుడు ట్వీట్లు చేస్తే ఇక అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.