ETV Bharat / international

పిల్లుల్లోనూ కరోనా వ్యాప్తి.. వాటి నుంచి మనుషులకు?

ప్రపంచవ్యాప్తంగా 44లక్షలకుపైగా మందికి సోకిన కరోనా మహమ్మారి.. పిల్లుల్లోనూ వ్యాప్తి చెందుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అయితే.. వాటి నుంచి మనుషులకు వైరస్​ సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. జంతువులను పెంచుకునేవారు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

author img

By

Published : May 14, 2020, 3:04 PM IST

Cats can contract coronavirus
పిల్లుల్లోనూ కరోనా వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మందికిపైగా సోకిన కరోనా మహమ్మారి.. జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతోంది. పిల్లులు కరోనా బారిన పడుతాయని, వాటిలో ఒకదాని నుంచి మరొకదానికి వైరస్​ వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు ఈ మహమ్మారి సోకుతుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు పరిశోధకులు.

అమెరికాలోని విస్కాన్సిన్​-మాడిసన్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైంది.

ఆరు రోజుల్లోనే అన్నింటికి..

కరోనా సోకిన వ్యక్తి వద్ద ఉన్న మూడు పిల్లులను ప్రయోగశాలలో పర్యవేక్షించారు పరిశోధకులు. నాసికా రంధ్రాన్ని శుభ్రం చేసిన క్రమంలో రెండు పిల్లుల్లో వైరస్​ ఉన్నట్లు గుర్తించారు. కేవలం మూడు రోజుల్లోనే మూడింటిలో వైరస్​ వ్యాప్తి చెందినట్లు తెలిపారు.

ఒకరోజు తర్వాత మూడు పిల్లులు ఉన్న ప్రతి బోనులో మరొక పిల్లిని ఉంచారు. అయితే.. కొత్తగా చేర్చిన వాటికి వెంటనే వైరస్​ సోకలేదని గుర్తించారు. ప్రతిరోజు ఆరు పిల్లుల్లో నాసికా రంధ్రం, మలం శుభ్రం చేసి వాటిలో వైరస్​ ఉనికిని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. కేవలం రెండు రోజుల్లోనే ఇంతకు ముందు వైరస్​కు గురికాని పిల్లులు సైతం వైరస్​ బారిన పడినట్లు గుర్తించారు. ఆరు రోజుల్లో అక్కడ ఉన్న మొత్తం పిల్లులు వైరస్​ బారిన పడినట్లు తెలిపారు.

నాసికా రంద్రాల ద్వారానే..

మలంలో వైరస్​ కనిపించలేదని తెలిపారు పరిశోధకులు. ప్రతి పిల్లిలో ముక్కు రంధ్రాల ద్వారానే వైరస్​ సంక్రమించినట్లు వెల్లడించారు. పిల్లుల్లో ఈ వైరస్​ ప్రాణాంతకం కాదని, ఏ ఒక్క పిల్లి కూడా అనారోగ్యానికి గురికాలేదని తెలిపారు. చివరికి.. అన్ని పిల్లులు వైరస్​ నుంచి కోలుకున్నాయని వెల్లడించారు.

"వైరస్​ సోకిన పిల్లుల్లో లక్షణాలు కనిపించకపోవటాన్ని గుర్తించటం మా పరిశోధనలో ముఖ్యమైన విషయం. కరోనా సోకిన మనుషులు, ఇతర పిల్లులతో కలిసిన సందర్భంలో పిల్లులకు వైరస్​ సోకే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు హోమ్​ క్వారంటైన్​లో ఉన్నప్పుడు తమ పిల్లలు, భార్యకు వైరస్​ సోకుతుందని ఆందోళన చెందుతున్నట్లే.. పెంపుడు జంతువులకు కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదంపై ఆందోళన పడాల్సిన అవసరం ఉంది."

- యోషిహిరో కవోకా, అధ్యయనం సహ రచయిత, విస్కాన్సిన్​ మాడిసన్​ విశ్వవిద్యాలయం.

జంతువులకు వైరస్​ సోకే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు వైరస్​ సోకుతుందనేందుకు ఎంలాటి ఆధారం లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని బ్రోంజ్​ జూలో పెద్ద సంఖ్యలో పిల్లులకు వైరస్​ సోకటాన్ని గుర్తుచేశారు. జంతు ప్రేమికులు జాగ్రత్తలు పాటించాలని.. ఎప్పటికప్పుడు పశువైద్యుల సలహాలు తీసుకోవాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా 44 లక్షల మందికిపైగా సోకిన కరోనా మహమ్మారి.. జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతోంది. పిల్లులు కరోనా బారిన పడుతాయని, వాటిలో ఒకదాని నుంచి మరొకదానికి వైరస్​ వ్యాప్తి చెందుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు ఈ మహమ్మారి సోకుతుందనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదన్నారు పరిశోధకులు.

అమెరికాలోని విస్కాన్సిన్​-మాడిసన్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయనం న్యూ ఇంగ్లాండ్​ జర్నల్​ ఆఫ్​ మెడిసిన్​లో ప్రచురితమైంది.

ఆరు రోజుల్లోనే అన్నింటికి..

కరోనా సోకిన వ్యక్తి వద్ద ఉన్న మూడు పిల్లులను ప్రయోగశాలలో పర్యవేక్షించారు పరిశోధకులు. నాసికా రంధ్రాన్ని శుభ్రం చేసిన క్రమంలో రెండు పిల్లుల్లో వైరస్​ ఉన్నట్లు గుర్తించారు. కేవలం మూడు రోజుల్లోనే మూడింటిలో వైరస్​ వ్యాప్తి చెందినట్లు తెలిపారు.

ఒకరోజు తర్వాత మూడు పిల్లులు ఉన్న ప్రతి బోనులో మరొక పిల్లిని ఉంచారు. అయితే.. కొత్తగా చేర్చిన వాటికి వెంటనే వైరస్​ సోకలేదని గుర్తించారు. ప్రతిరోజు ఆరు పిల్లుల్లో నాసికా రంధ్రం, మలం శుభ్రం చేసి వాటిలో వైరస్​ ఉనికిని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. కేవలం రెండు రోజుల్లోనే ఇంతకు ముందు వైరస్​కు గురికాని పిల్లులు సైతం వైరస్​ బారిన పడినట్లు గుర్తించారు. ఆరు రోజుల్లో అక్కడ ఉన్న మొత్తం పిల్లులు వైరస్​ బారిన పడినట్లు తెలిపారు.

నాసికా రంద్రాల ద్వారానే..

మలంలో వైరస్​ కనిపించలేదని తెలిపారు పరిశోధకులు. ప్రతి పిల్లిలో ముక్కు రంధ్రాల ద్వారానే వైరస్​ సంక్రమించినట్లు వెల్లడించారు. పిల్లుల్లో ఈ వైరస్​ ప్రాణాంతకం కాదని, ఏ ఒక్క పిల్లి కూడా అనారోగ్యానికి గురికాలేదని తెలిపారు. చివరికి.. అన్ని పిల్లులు వైరస్​ నుంచి కోలుకున్నాయని వెల్లడించారు.

"వైరస్​ సోకిన పిల్లుల్లో లక్షణాలు కనిపించకపోవటాన్ని గుర్తించటం మా పరిశోధనలో ముఖ్యమైన విషయం. కరోనా సోకిన మనుషులు, ఇతర పిల్లులతో కలిసిన సందర్భంలో పిల్లులకు వైరస్​ సోకే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు హోమ్​ క్వారంటైన్​లో ఉన్నప్పుడు తమ పిల్లలు, భార్యకు వైరస్​ సోకుతుందని ఆందోళన చెందుతున్నట్లే.. పెంపుడు జంతువులకు కూడా ఈ మహమ్మారి సోకే ప్రమాదంపై ఆందోళన పడాల్సిన అవసరం ఉంది."

- యోషిహిరో కవోకా, అధ్యయనం సహ రచయిత, విస్కాన్సిన్​ మాడిసన్​ విశ్వవిద్యాలయం.

జంతువులకు వైరస్​ సోకే ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే.. పిల్లుల నుంచి మనుషులకు వైరస్​ సోకుతుందనేందుకు ఎంలాటి ఆధారం లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని బ్రోంజ్​ జూలో పెద్ద సంఖ్యలో పిల్లులకు వైరస్​ సోకటాన్ని గుర్తుచేశారు. జంతు ప్రేమికులు జాగ్రత్తలు పాటించాలని.. ఎప్పటికప్పుడు పశువైద్యుల సలహాలు తీసుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.