బొలీవియాలోని చాటక్విలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
100 మీటర్ల లోయలో పడిన బస్సును వెలికి తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉండవచ్చని అంచనా వేశారు.
ప్రయాణికులకు తీవ్ర గాయాలు అవడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 50 మంది మృతి