అమెరికా జాతీయ భద్రతా మండలిలో ఇద్దరు భారతీయ అమెరికన్ల పేర్లను ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. దక్షిణాసియా సీనియర్ డైరక్టర్గా సుమొనా గుహాను, టెక్నాలజీ, జాతీయ భద్రతకి డైరక్టర్గా తరుణ్ ఛబ్రను.. బైడన్ నియమించారు. మరోవైపు.. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ గా భారత సంతతి అమెరికన్ సబ్రిన సింగ్ నియమితులయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్కు సబ్రిన్ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు.
బైెడెన్-హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ వ్యవహరించారు. అంతేకాకుండా ఒబామా ప్రభుత్వంలో ఉపాధ్యక్షుడు బైడెన్కు జాతీయ భద్రత వ్యవహారాల ప్రత్యేక సలహాదారుగా ఈమె ఉన్నారు. ఒబామా ప్రభుత్వంలో జాతీయ భద్రతా కౌన్సిల్లో చబ్రా పనిచేశారు.
ఇదీ చూడండి: బైడెన్ ప్రమాణ స్వీకారానికి నేను రాను: ట్రంప్