ETV Bharat / international

జాతివివక్ష నిర్మూలనకు బైడెన్​ కీలక నిర్ణయం

author img

By

Published : Jan 27, 2021, 2:34 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతివివక్ష నిర్మూలనే లక్ష్యంగా మంగళవారం నాడు నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు. జైళ్ల నిర్వహణపై ప్రైవేటు సంస్థలకు అనుమతి రద్దు చేశారు.

biden, us, racism
జాతివివక్ష నిర్మూలనపై బైడెన్​ కీలక నిర్ణయం

ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతివివక్ష నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యవస్థాగత వివక్షను నిర్మూలించి, దేశవ్యాప్తంగా సమానత్వం ఉండేలా నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆసియా అమెరికన్లు, పసిఫిక్​ దీవులకు చెందిన వారిపైన జాత్యహంకారులు వివక్ష చూపకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారితో మరింత సన్నిహితంగా మెలగాలని న్యాయశాఖకు సూచించారు. కొవిడ్​పై పోరులో వివక్షకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య, మానవహక్కుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్​ ఏర్పాటు చేసిన 'కౌంటర్​ ఫాక్చువల్ 1776 కమిషన్'​ను బైడెన్​ రద్దు చేశారు.

"జార్జి ఫ్లాయిడ్​ మరణంతో న్యాయ వ్యవస్థ గొంతు నులిమినట్టు అయింది. నేను అతని కుమార్తెను కలిసినప్పుడు.. మా నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని ఆ చిన్నారి చెప్పింది. ఆమె చెప్పింది నిజం. ఆ ఘటన మార్పునకు కారణమైంది. అందరూ సమానం అని పేర్కొనే మన దేశ మూల సూత్రాలను ఏనాడూ అనుసరించలేదు. అవి పాటించాల్సిన సమయం వచ్చింది."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ప్రైవేటు జైళ్లు రద్దు..

జైళ్ల నిర్వహణపై ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతుల్ని బైడెన్ రద్దు చేశారు. ఈ చర్యతో జైళ్లపై కార్పొరేట్​ సంస్థల అక్రమార్జనకు అడ్డుకట్ట పడిందని ఆయన​ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం 14వేల మంది నేరస్థులు ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్న జైళ్లలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మొత్తం నేరస్థుల సంఖ్యలో 9 శాతం.

బైడెన్​కు ఎదురుదెబ్బ..

​హామీల్లో ఒకటైన వలసలకు సంబంధించి బైడెన్​కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారుల బహిష్కరణపై జారీ చేసిన 100 రోజుల మారటోరియాన్ని స్థానిక కోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్రమ వలసదారులకు కూడా చట్టబద్ధత కల్పించాలన్న బైడెన్​ ప్రయత్నానికి బ్రేక్​ పడినట్టు అయింది.

ఇదీ చదవండి : ట్రంప్​ అభిశంసనపై విచారణ- నిర్దోషిగా తేలే అవకాశం!

ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతివివక్ష నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యవస్థాగత వివక్షను నిర్మూలించి, దేశవ్యాప్తంగా సమానత్వం ఉండేలా నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆసియా అమెరికన్లు, పసిఫిక్​ దీవులకు చెందిన వారిపైన జాత్యహంకారులు వివక్ష చూపకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారితో మరింత సన్నిహితంగా మెలగాలని న్యాయశాఖకు సూచించారు. కొవిడ్​పై పోరులో వివక్షకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య, మానవహక్కుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్​ ఏర్పాటు చేసిన 'కౌంటర్​ ఫాక్చువల్ 1776 కమిషన్'​ను బైడెన్​ రద్దు చేశారు.

"జార్జి ఫ్లాయిడ్​ మరణంతో న్యాయ వ్యవస్థ గొంతు నులిమినట్టు అయింది. నేను అతని కుమార్తెను కలిసినప్పుడు.. మా నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని ఆ చిన్నారి చెప్పింది. ఆమె చెప్పింది నిజం. ఆ ఘటన మార్పునకు కారణమైంది. అందరూ సమానం అని పేర్కొనే మన దేశ మూల సూత్రాలను ఏనాడూ అనుసరించలేదు. అవి పాటించాల్సిన సమయం వచ్చింది."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

ప్రైవేటు జైళ్లు రద్దు..

జైళ్ల నిర్వహణపై ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతుల్ని బైడెన్ రద్దు చేశారు. ఈ చర్యతో జైళ్లపై కార్పొరేట్​ సంస్థల అక్రమార్జనకు అడ్డుకట్ట పడిందని ఆయన​ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం 14వేల మంది నేరస్థులు ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్న జైళ్లలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మొత్తం నేరస్థుల సంఖ్యలో 9 శాతం.

బైడెన్​కు ఎదురుదెబ్బ..

​హామీల్లో ఒకటైన వలసలకు సంబంధించి బైడెన్​కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారుల బహిష్కరణపై జారీ చేసిన 100 రోజుల మారటోరియాన్ని స్థానిక కోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్రమ వలసదారులకు కూడా చట్టబద్ధత కల్పించాలన్న బైడెన్​ ప్రయత్నానికి బ్రేక్​ పడినట్టు అయింది.

ఇదీ చదవండి : ట్రంప్​ అభిశంసనపై విచారణ- నిర్దోషిగా తేలే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.