ETV Bharat / international

అమెరికా వాతావరణ రాయబారిగా జాన్​ కెర్రీ నియామకం

author img

By

Published : Nov 24, 2020, 10:34 AM IST

Updated : Nov 24, 2020, 12:30 PM IST

అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​.. తన కేబినెట్​లో కొందరి పేర్లను ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. కీలకమైన విదేశాంగ శాఖ ఆంటోనీ బ్లింకెన్​కు అప్పగించగా.. జాన్​ కెర్రీకి అమెరికా జాతీయ భద్రతా మండలిలో వాతావరణ రాయబారిగా నియమించారు.

John Kerry
జాన్​ కెర్రీ

అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది. కేబినెట్‌లో కొందరి పేర్లను బైడెన్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు.

అమెరికా మాజీ కార్యదర్శి, సీనియర్‌ సెనెటర్‌ జాన్‌ కెర్రీ జాతీయ భద్రతా మండలిలో వాతావరణ రాయబారిగా నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో-బైడెన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం నిర్మాతల్లో ఒకరైన జాన్‌ కెర్రీకి... వాతావరణ మార్పులపై పోరాటానికి మరోసారి సారథ్యం వహించే అవకాశం దక్కినట్లు సమాచారం.

వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించిన అమెరికా జాతీయ భద్రతా మండలిలో తొలి సభ్యుడిగా జాన్‌ కెర్రీ నియమితులయ్యారు. వాతావరణానికి హానీ కలిగించే కర్బన ఉద్గారాల నియంత్రణకు గత ప్రభుత్వం కంటే కఠినంగా, విస్తృతంగా పోరాటం చేయనున్నట్లు ఎన్నికల్లో బైడెన్​ హామీ ఇచ్చారు. ఈ మేరకు జాన్‌ కెర్రీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియమకాన్ని జాన్‌ కెర్రీ ధ్రువీకరించారు.

త్వరలో ఏర్పడనున్న అమెరికా కొత్త ప్రభుత్వం వాతావరణ సంక్షోభాన్ని అత్యవసర జాతీయ ముప్పుగా భావిస్తోందని కెర్రీ ట్వీట్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, తమ మిత్రులు, యువ వాతావరణ ఉద్యమకారులతో భాగస్వామ్యం కావటంతో గర్వంగా ఉందన్నారు.

విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు..

కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించారు బైడెన్​. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం.

జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్‌ సలహాదారుడు జేక్‌ సులివాన్‌ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేన్స్‌ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్‌ గ్రెన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా-బైడెన్‌ ప్రభుత్వంలో పనిచేసిన వారే.

ఇదీ చూడండి: ట్రంప్​ కంటే జో బైడెనే ప్రమాదకారి: చైనా

అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ మంత్రివర్గ కూర్పు దాదాపు పూర్తయ్యింది. కేబినెట్‌లో కొందరి పేర్లను బైడెన్‌ తాజాగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అమెరికా భద్రత, విదేశీ వ్యవహారాల బృందాన్ని ప్రకటించారు.

అమెరికా మాజీ కార్యదర్శి, సీనియర్‌ సెనెటర్‌ జాన్‌ కెర్రీ జాతీయ భద్రతా మండలిలో వాతావరణ రాయబారిగా నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో-బైడెన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పారిస్‌ వాతావరణ ఒప్పందం నిర్మాతల్లో ఒకరైన జాన్‌ కెర్రీకి... వాతావరణ మార్పులపై పోరాటానికి మరోసారి సారథ్యం వహించే అవకాశం దక్కినట్లు సమాచారం.

వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించిన అమెరికా జాతీయ భద్రతా మండలిలో తొలి సభ్యుడిగా జాన్‌ కెర్రీ నియమితులయ్యారు. వాతావరణానికి హానీ కలిగించే కర్బన ఉద్గారాల నియంత్రణకు గత ప్రభుత్వం కంటే కఠినంగా, విస్తృతంగా పోరాటం చేయనున్నట్లు ఎన్నికల్లో బైడెన్​ హామీ ఇచ్చారు. ఈ మేరకు జాన్‌ కెర్రీని నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియమకాన్ని జాన్‌ కెర్రీ ధ్రువీకరించారు.

త్వరలో ఏర్పడనున్న అమెరికా కొత్త ప్రభుత్వం వాతావరణ సంక్షోభాన్ని అత్యవసర జాతీయ ముప్పుగా భావిస్తోందని కెర్రీ ట్వీట్‌ చేశారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, తమ మిత్రులు, యువ వాతావరణ ఉద్యమకారులతో భాగస్వామ్యం కావటంతో గర్వంగా ఉందన్నారు.

విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు..

కీలకమైన విదేశీ వ్యవహారాల శాఖను ఆంటోనీ బ్లింకెన్‌కు అప్పగించారు బైడెన్​. అంతర్గత భద్రత మంత్రిగా ప్రముఖ న్యాయవాది అలెజాండ్ర మాయోర్కస్‌ను ఎంపికచేశారు. ఈ పదవి చేపట్టనున్న తొలి లాటినో వ్యక్తి ఈయనే కావడం విశేషం.

జాతీయ భద్రత సలహాదారుగా బైడెన్‌ సలహాదారుడు జేక్‌ సులివాన్‌ను నియమించారు. సీఐఏ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేన్స్‌ను జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన లిండా థామస్‌ గ్రెన్‌ఫీల్డ్‌ను ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా నియమించారు. వీరంతా 2009-2017 మధ్య ఒబామా-బైడెన్‌ ప్రభుత్వంలో పనిచేసిన వారే.

ఇదీ చూడండి: ట్రంప్​ కంటే జో బైడెనే ప్రమాదకారి: చైనా

Last Updated : Nov 24, 2020, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.