ETV Bharat / international

'ఇండో-ఫసిఫిక్​లో అమెరికా వ్యూహానికి 'క్వాడ్​' పునాది'

author img

By

Published : Jan 30, 2021, 3:19 PM IST

నాలుగు దేశాల సమూహం 'క్వాడ్​'ను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా కోరుకుంటున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ తెలిపారు. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానాల అమలుకు క్వాడ్​ పునాదిగా మారనుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Quad as fundamental foundation
'అమెరికా 'క్వాడ్'​ను ముందుండి నడిపిస్తుంది'

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో తమ వ్యూహాత్మక విధానాలు అమలు చేసేందుకు 'క్వాడ్​' ప్రాథమిక పునాదిగా అధ్యక్షుడు జో బైడెన్​ బృందం భావిస్తోందని అమెరికాకు చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. 'క్వాడ్'లో జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో పాటు అమెరికా సభ్య దేశంగా ఉంది.

నాలుగు దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్​ను అమెరికా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ అన్నారు. క్వాడ్​ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత లోతుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు.. యూఎస్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పీస్​ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు. ఇండో-పసిఫిక్​ పాలసీ, క్వాడ్​లో సభ్యత్వం మొదలైనవి గతంలో ట్రంప్​ బృందం చొరవతోనే సాధ్యమైనట్లు గుర్తుచేశారు. వీటిని కొనసాగించేందుకు బైడెన్​ బృందానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

చైనా దురాక్రమణ చర్యలకు అడ్డుకట్టు వేసేందుకు నాలుగు దేశాలు కలిసి 2017లో 'క్వాడ్​'ను ఏర్పాటు చేశాయి.

ఇదీ చదవండి:అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో తమ వ్యూహాత్మక విధానాలు అమలు చేసేందుకు 'క్వాడ్​' ప్రాథమిక పునాదిగా అధ్యక్షుడు జో బైడెన్​ బృందం భావిస్తోందని అమెరికాకు చెందిన ఓ సీనియర్​ అధికారి వెల్లడించారు. 'క్వాడ్'లో జపాన్, భారత్, ఆస్ట్రేలియాలతో పాటు అమెరికా సభ్య దేశంగా ఉంది.

నాలుగు దేశాలు సభ్యత్వం కలిగిన క్వాడ్​ను అమెరికా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ అన్నారు. క్వాడ్​ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత లోతుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు.. యూఎస్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పీస్​ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలిపారు. ఇండో-పసిఫిక్​ పాలసీ, క్వాడ్​లో సభ్యత్వం మొదలైనవి గతంలో ట్రంప్​ బృందం చొరవతోనే సాధ్యమైనట్లు గుర్తుచేశారు. వీటిని కొనసాగించేందుకు బైడెన్​ బృందానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

చైనా దురాక్రమణ చర్యలకు అడ్డుకట్టు వేసేందుకు నాలుగు దేశాలు కలిసి 2017లో 'క్వాడ్​'ను ఏర్పాటు చేశాయి.

ఇదీ చదవండి:అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.