ETV Bharat / international

నా రిసార్టులో ఆ కార్యక్రమం రద్దు: ట్రంప్ - US President Donald Trump has said the next G7 summit will not be at one of his own Florida golf clubs

జీ-7 శిఖరాగ్ర సదస్సు వేదికను మారుస్తున్నట్లు ప్రకటించారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. వచ్చే ఏడాది జూన్​లో అమెరికా కేంద్రంగా ఈ సదస్సు జరగనుంది. ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టులో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఇదివరకు ప్రకటించారు ట్రంప్​. విపక్ష డెమొక్రాట్ల నుంచి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం వల్ల నిర్ణయాన్ని మార్చుకున్నారు.

జీ-7 సదస్సు వేదికపై ట్రంప్ వివరణ
author img

By

Published : Oct 20, 2019, 1:40 PM IST

వచ్చే ఏడాది జూన్​లో అమెరికా వేదికగా జరగాల్సిన జీ-7 సమావేశం ముందుగా ప్రకటించినట్లుగా తన రిసార్ట్​లో జరగదని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంమై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు.

ట్రంప్ సొంత రిసార్టులోనే జీ-7 సదస్సు ఉంటుందని గత గురువారం ప్రకటించారు శ్వేతసౌధం సిబ్బంది ప్రధాన అధికారి మైక్ ముల్వనేయ్. ఈ ప్రకటన అనంతరం దిగువ సభలో డెమొక్రాట్​ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీ-7 వేదికే అధ్యక్షుడి అవినీతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సమావేశం వేదికగా తన సొంత ఆస్తిని ఉపయోగించాలనే ఆలోచన విరమించుకున్నారు ట్రంప్. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

"మీడియా దుష్ప్రచారం, డెమొక్రాట్ అనుకూల వ్యక్తుల శత్రుత్వం కారణంగా 2020 జీ-7 సదస్సు మియామిలోని ట్రంప్ నేషనల్ డోరల్​లో నిర్వహించాలనే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. "

-ట్రంప్ ట్వీట్

సమావేశం కోసం తాము క్యాంప్ డేవిడ్ సహా మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నామని శ్వేతసౌధం అధికారి ముల్వానేయ్ వెల్లడించారు.

'డోరల్.. ఆ సంబంధాలకు మంచిది కాదు'

ఓ అమెరికా నేతను విదేశీ శక్తుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు ఉద్దేశించిన చట్టాలను ఈ సమావేశం ద్వారా ఉల్లంఘించినట్లు అవుతుందని పలువురు విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది విదేశీ వ్యవహారాలు, దేశీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు.

"ఆయన తన కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు."

-జెర్రీ నాడ్లర్, ఛైర్మన్, హౌస్ జ్యుడిషియరీ కమిటీ.

ఇదీ చూడండి: వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్

వచ్చే ఏడాది జూన్​లో అమెరికా వేదికగా జరగాల్సిన జీ-7 సమావేశం ముందుగా ప్రకటించినట్లుగా తన రిసార్ట్​లో జరగదని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంమై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు.

ట్రంప్ సొంత రిసార్టులోనే జీ-7 సదస్సు ఉంటుందని గత గురువారం ప్రకటించారు శ్వేతసౌధం సిబ్బంది ప్రధాన అధికారి మైక్ ముల్వనేయ్. ఈ ప్రకటన అనంతరం దిగువ సభలో డెమొక్రాట్​ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీ-7 వేదికే అధ్యక్షుడి అవినీతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సమావేశం వేదికగా తన సొంత ఆస్తిని ఉపయోగించాలనే ఆలోచన విరమించుకున్నారు ట్రంప్. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

"మీడియా దుష్ప్రచారం, డెమొక్రాట్ అనుకూల వ్యక్తుల శత్రుత్వం కారణంగా 2020 జీ-7 సదస్సు మియామిలోని ట్రంప్ నేషనల్ డోరల్​లో నిర్వహించాలనే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. "

-ట్రంప్ ట్వీట్

సమావేశం కోసం తాము క్యాంప్ డేవిడ్ సహా మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నామని శ్వేతసౌధం అధికారి ముల్వానేయ్ వెల్లడించారు.

'డోరల్.. ఆ సంబంధాలకు మంచిది కాదు'

ఓ అమెరికా నేతను విదేశీ శక్తుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు ఉద్దేశించిన చట్టాలను ఈ సమావేశం ద్వారా ఉల్లంఘించినట్లు అవుతుందని పలువురు విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది విదేశీ వ్యవహారాలు, దేశీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు.

"ఆయన తన కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు."

-జెర్రీ నాడ్లర్, ఛైర్మన్, హౌస్ జ్యుడిషియరీ కమిటీ.

ఇదీ చూడండి: వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్

Mumbai, Oct 20 (ANI): Bollywood actors Rajkummar Rao and Neha Dhupia were seen together in Mumbai. Keeping their look casual both flashed big smile to shutterbugs. Malaika Arora was also seen in the city. She managed to stun everyone with her traditional attire.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.