ETV Bharat / international

'క్యాపిటల్​పై దాడి' విచారణకు రిపబ్లికన్ల మద్దతు

అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద జనవరి 6న జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ద్వైపాక్షిక కమిషన్​ను ఏర్పాటు చేసే బిల్లుకు ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సహా 35 మంది రిపబ్లికన్లు మద్దతు తెలిపారు. 252-175తో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్​కు పంపించారు.

author img

By

Published : May 20, 2021, 11:36 AM IST

us capitol
క్యాపిటల్

జనవరి 6న అమెరికా క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ద్వైపాక్షిక కమిషన్​ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు డెమొక్రాట్లు సహా 35 మంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు వ్యతిరేకంగా సాగే ఈ ప్రతిపాదనను మరికొంత మంది రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని న్యూయార్క్​ ప్రతినిధి, రిపబ్లికన్​ నేత జాన్​ కాట్కో పేర్కొన్నారు.

"రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తమ పంతాన్ని వీడి, ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతున్నాను. క్యాపిటల్​ భవనం వద్ద జరిగిన అల్లర్ల గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. ఆ ఘటన ఎలా జరిగింది? భవిష్యత్తులో క్యాపిటల్​ భవనం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి? వంటి విషయాల అవగాహనకు ఇది ఉపయోగపడుతుంది. ఇది నిజాల్ని తెలుసుకోవడానికి మాత్రమే. పక్షపాత రాజకీయాల కోసం కాదు."

- జాన్ కాట్కో, రిపబ్లికన్ నేత

ప్రతినిధుల సభలో 252-175తో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్​కు పంపారు.

అరెస్టుల పర్వం..

అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 'స్వీకర్ నాన్సీ పెలోసీని బయటకు తీసుకువచ్చి ఉరి తీయండి' అని అరిచిన పెన్సిల్వేనియాకు చెందిన పాలిన్​ బార్ ఆఫ్​ కేన్​ అనే మహిళను న్యూయార్క్​, పెన్సిల్వేనియా అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

ఈమె వ్యాఖ్యలు భద్రతా దళాలు ధరించిన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి 6న క్యాపిటల్​ భవనం వద్దకు పాలిన్​ వెళ్లారని ఆమె భర్త వెల్లడించారు. కానీ, ఆమె హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదని చెప్పారు. ఈ కేసులో న్యాయస్థానం విచారణకు వర్చవల్​గా పాలిన్​ హాజరయ్యారు. అనంతరం.. ఆమెను బాండ్​పై అధికారులు విడుదల చేశారు. ఇప్పటివరకు క్యాపిటల్​పై దాడి ఘటనలో 400కు పైగా మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 'భారత్​కు అమెరికా 500 మిలియన్​ డాలర్ల సాయం'

జనవరి 6న అమెరికా క్యాపిటల్​ భవనంపై జరిగిన దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ద్వైపాక్షిక కమిషన్​ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు డెమొక్రాట్లు సహా 35 మంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు వ్యతిరేకంగా సాగే ఈ ప్రతిపాదనను మరికొంత మంది రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని న్యూయార్క్​ ప్రతినిధి, రిపబ్లికన్​ నేత జాన్​ కాట్కో పేర్కొన్నారు.

"రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తమ పంతాన్ని వీడి, ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతున్నాను. క్యాపిటల్​ భవనం వద్ద జరిగిన అల్లర్ల గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. ఆ ఘటన ఎలా జరిగింది? భవిష్యత్తులో క్యాపిటల్​ భవనం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి? వంటి విషయాల అవగాహనకు ఇది ఉపయోగపడుతుంది. ఇది నిజాల్ని తెలుసుకోవడానికి మాత్రమే. పక్షపాత రాజకీయాల కోసం కాదు."

- జాన్ కాట్కో, రిపబ్లికన్ నేత

ప్రతినిధుల సభలో 252-175తో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్​కు పంపారు.

అరెస్టుల పర్వం..

అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 'స్వీకర్ నాన్సీ పెలోసీని బయటకు తీసుకువచ్చి ఉరి తీయండి' అని అరిచిన పెన్సిల్వేనియాకు చెందిన పాలిన్​ బార్ ఆఫ్​ కేన్​ అనే మహిళను న్యూయార్క్​, పెన్సిల్వేనియా అధికారులు బుధవారం అరెస్టు చేశారు.

ఈమె వ్యాఖ్యలు భద్రతా దళాలు ధరించిన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి 6న క్యాపిటల్​ భవనం వద్దకు పాలిన్​ వెళ్లారని ఆమె భర్త వెల్లడించారు. కానీ, ఆమె హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదని చెప్పారు. ఈ కేసులో న్యాయస్థానం విచారణకు వర్చవల్​గా పాలిన్​ హాజరయ్యారు. అనంతరం.. ఆమెను బాండ్​పై అధికారులు విడుదల చేశారు. ఇప్పటివరకు క్యాపిటల్​పై దాడి ఘటనలో 400కు పైగా మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

ఇదీ చూడండి: 'భారత్​కు అమెరికా 500 మిలియన్​ డాలర్ల సాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.