ETV Bharat / international

యెమెన్​లో వరదలు- 13 మంది మృతి

author img

By

Published : May 1, 2021, 6:02 PM IST

యెమెన్​ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వరదల ధాటికి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు.

Yemen floods
యెమెన్​లో వరదలు

భారీ వర్షాల కారణంగా యెమెన్ దేశంలో వరదలు సంభవించాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతులు యెమెన్​ రాజధాని సనా, ఐబీబీ, షబ్వా, హోడీడా రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.

ఆడెన్​, తాయిజ్, హద్రామావత్ రాష్ట్రాల్లోనూ భారీగా వరదలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లు నీటమునిగాయన్నారు. ఇళ్లలో, కార్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

గత ఏడాది కూడా యెమెన్​లో వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు.

ఇదీ చదవండి : 'భారత్​లో వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ ఉత్తమం'

భారీ వర్షాల కారణంగా యెమెన్ దేశంలో వరదలు సంభవించాయి. వరదల ప్రభావానికి ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మృతులు యెమెన్​ రాజధాని సనా, ఐబీబీ, షబ్వా, హోడీడా రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు.

ఆడెన్​, తాయిజ్, హద్రామావత్ రాష్ట్రాల్లోనూ భారీగా వరదలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లు నీటమునిగాయన్నారు. ఇళ్లలో, కార్లలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

గత ఏడాది కూడా యెమెన్​లో వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు.

ఇదీ చదవండి : 'భారత్​లో వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ ఉత్తమం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.