ETV Bharat / entertainment

Vishal Censor Board : స్టార్ హీరో సంచలన వీడియో రిలీజ్​.. సెన్సార్‌ బోర్డుకు రూ. 6 లక్షల లంచం!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 10:29 PM IST

Vishal Censor Board : తన కొత్త సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసేందుకు.. సంబంధిత అధికారులు డబ్బులు అడిగారంటూ నటుడు విశాల్‌ ఆరోపించారు. వీడియో రిలీజ్ చేశారు. ఆ వివరాలు..

Vishal Censor Board : సెన్సార్‌ బోర్డులో అవినీతి.. రూ. 6.5 లక్షలిచ్చి సినిమా రిలీజ్​ చేసుకున్న స్టార్ హీరో
Vishal Censor Board : సెన్సార్‌ బోర్డులో అవినీతి.. రూ. 6.5 లక్షలిచ్చి సినిమా రిలీజ్​ చేసుకున్న స్టార్ హీరో

Vishal Censor Board : కోలీవుడ్ హీరో విశాల్​ ఇటీవలే చాలా కాలం తర్వాత మార్క్ ఆంటోనీతో మంచి సక్సెస్​ను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సెన్సార్‌ జారీ చేసే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్​ మూవీ 'మార్క్‌ ఆంటోని' విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడుతూ ఈ సెన్సేషనల్​ కామెంట్స్​ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ పోస్ట్‌ ట్వీట్ చేశారు.

"అవినీతి గురించి స్క్రీన్​పై చూడడం వరకు ఓకే గానీ రియల్​ లైఫ్​లో జరగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా గవర్న్​మెంట్​ ఆఫీసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇదే కొనసాగుతోంది. నా మార్క్‌ ఆంటోని మూవీ హిందీ వెర్షన్‌ సెన్సార్‌ వర్క్​ పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలను ఇచ్చాను. స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు లంచంగా ఇచ్చాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. వేరే దారిలేక ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతలకూ ఇలా జరగకూడదని అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఆర్జించిన డబ్బు ఈ విధంగా పోయే ఛాన్సే లేదు! న్యాయం గెలుస్తుంది అని భావిస్తున్నాను" అని విశాల్​ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారు. ఈ మేరకు మోదీ, శిందే ఎక్స్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి తాను డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలను ట్వీట్​లో పోస్ట్​ పెట్టారు.

Vishal Mark Antony : కాగా, విశాల్‌, ఎస్‌.జే. సూర్య ప్రధాన పాత్రల్లో మార్క్​ ఆంటోనీ తెరకెక్కింది. డైరెక్టర్​ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడిగా వ్యవహరించారు. టైమ్‌ ట్రావెల్‌ అండ్ గ్యాంగ్​ స్టర్​ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 15న గ్రాండ్​గా రిలీజైంది. హిందీలో నేడు(సెప్టెంబర్ 28) మూవీ రిలీజైంది. ఈ క్రమంలోనే హిందీ వెర్షన్​కు సెన్సార్‌ చేయించే క్రమంలోనే అధికారులు లంచం తీసుకున్నారని విశాల్‌ ఆరోపణలు చేశారు.

Vijay Antony Latest News : పెద్ద కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. చిన్న కూతురితో కలిసి ప్రమోషన్లకు!

Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్​ బాస్​ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే..

Vishal Censor Board : కోలీవుడ్ హీరో విశాల్​ ఇటీవలే చాలా కాలం తర్వాత మార్క్ ఆంటోనీతో మంచి సక్సెస్​ను అందుకున్నారు. అయితే తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సెన్సార్‌ జారీ చేసే సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(Central Board of Film Certification) కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆరోపణలు చేశారు. తన లేటెస్ట్​ మూవీ 'మార్క్‌ ఆంటోని' విషయంలో తనకు ఎదురైన సమస్య గురించి మాట్లాడుతూ ఈ సెన్సేషనల్​ కామెంట్స్​ చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఈ పోస్ట్‌ ట్వీట్ చేశారు.

"అవినీతి గురించి స్క్రీన్​పై చూడడం వరకు ఓకే గానీ రియల్​ లైఫ్​లో జరగడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ముఖ్యంగా గవర్న్​మెంట్​ ఆఫీసుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముంబయి సెన్సార్‌ ఆఫీస్‌లోనూ ఇదే కొనసాగుతోంది. నా మార్క్‌ ఆంటోని మూవీ హిందీ వెర్షన్‌ సెన్సార్‌ వర్క్​ పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలను ఇచ్చాను. స్క్రీనింగ్‌ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్‌ కోసం రూ. 3 లక్షలు లంచంగా ఇచ్చాను. నా కెరీర్‌లో ఇలాంటి పరిస్థితిని అస్సలు ఎప్పుడూ చూడలేదు. వేరే దారిలేక ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నాకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతలకూ ఇలా జరగకూడదని అనుకుంటున్నాను. ఎంతో కష్టపడి ఆర్జించిన డబ్బు ఈ విధంగా పోయే ఛాన్సే లేదు! న్యాయం గెలుస్తుంది అని భావిస్తున్నాను" అని విశాల్​ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పారు. ఈ మేరకు మోదీ, శిందే ఎక్స్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. ఎవరెవరికి తాను డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్‌ ఖాతా వివరాలను ట్వీట్​లో పోస్ట్​ పెట్టారు.

Vishal Mark Antony : కాగా, విశాల్‌, ఎస్‌.జే. సూర్య ప్రధాన పాత్రల్లో మార్క్​ ఆంటోనీ తెరకెక్కింది. డైరెక్టర్​ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడిగా వ్యవహరించారు. టైమ్‌ ట్రావెల్‌ అండ్ గ్యాంగ్​ స్టర్​ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళంలో ఈ నెల 15న గ్రాండ్​గా రిలీజైంది. హిందీలో నేడు(సెప్టెంబర్ 28) మూవీ రిలీజైంది. ఈ క్రమంలోనే హిందీ వెర్షన్​కు సెన్సార్‌ చేయించే క్రమంలోనే అధికారులు లంచం తీసుకున్నారని విశాల్‌ ఆరోపణలు చేశారు.

Vijay Antony Latest News : పెద్ద కుమార్తె లేదన్న దుఃఖాన్ని దిగమింగుకుని.. చిన్న కూతురితో కలిసి ప్రమోషన్లకు!

Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్​ బాస్​ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.