ETV Bharat / entertainment

Rajamouli Ad : స్టైలిష్​ లుక్​లో రాజమౌళి.. అక్కడ కూడా జక్కన్న మార్క్​!

author img

By

Published : Jun 29, 2023, 9:50 AM IST

Rajamouli Oppo Ad : 'ఆర్ఆర్​ఆర్'​ లాంటి మాస్టర్​పీస్​లను ప్రపంచానికి అందించిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు వరల్డ్​ ఫేమస్​ అయిపోయారు. ఎప్పుడూ తెరవెనుక ఉండి సినిమాను నడిపించే ఈ స్టార్​.. తాజాగా తెరపై కనిపించి సందడి చేశారు. ఇంతకీ ఎక్కడంటే ?

rajamouli
rajamouli

Rajamouli Ad : తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది యావత్​ సినీ ఇండస్ట్రీని షేక్​ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. 'బాహుబలి','ఆర్​ఆర్​ఆర్​' లాంటి సినిమాలతో జక్కన్న.. ప్రపంచం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు. 'నాటు నాటు'తో తెలుగు ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఈ స్టార్​ డైరెక్టర్​ ప్రస్తుతం ఖాళీ లేకుండా మరో మాస్టర్​పీస్​ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. సూపర్​ స్టార్​ మహేశ్​ బాబుతో అడ్వెంచర్​ మూవీని తెరకక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో జక్కన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది.

Rajamouli oppo Ad : మనం దర్శక ధీరుడిని తెర వెనక ఉండి కథను నడిపించడాన్నే చూసుంటాం. కానీ ఆయన అప్పుడప్పుడు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి తళుక్కన మెరుస్తుంటారు. 'సై','రైంబో','ఈగ', 'బాహుబలి', 'మజ్ను', 'ఆర్​ఆర్​ఆర్'​ లాంటి సినిమాల్లో కాసేపు స్క్రీన్​పై కనిపించి అలరించారు. అయితే ఆయన్ను పూర్తి నిడివిలో తెరపై చూసింది మాత్రం అరుదే. అయితే తాజాగా ఆయన ఓ యాడ్​ షూట్​లో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇటీవలే ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ ఒప్పో.. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసిడర్​గా చేసుకుంది. ఈ క్రమంలో తమ కొత్త ఫొన్​ ప్రమోషన్ కోసం జక్కన్నపై ఓ యాడ్​ను షూట్ చేశారు. అందులో రాజమౌళి ఓ న్యూ లుక్​లో కనిపించారు. ఎప్పుడూ సింపుల్​గా కనిపించే ఆయన.. ఇందులో మరింత స్టైలిష్​గా కనిపించడం వల్ల అభిమనులు ఔరా అంటున్నారు. ఈ లుక్​లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Rajamouli Movies : ఇక ఆయన్​ అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​ విషయానికి వస్తే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిగ్గెస్ట్​ బ్లాక్‌ బస్టర్‌ను ఇండస్ట్రీకి అందించిన జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని 'ఆస్కార్‌' వరకు తీసుకెళ్లారు. జూనియర్​ ఎన్​టీఆర్​, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని అద్భుతాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు.. సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​తో పాటు ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయని సమాచారం. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాల టాక్​. ఇక రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rajamouli Ad : తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది యావత్​ సినీ ఇండస్ట్రీని షేక్​ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. 'బాహుబలి','ఆర్​ఆర్​ఆర్​' లాంటి సినిమాలతో జక్కన్న.. ప్రపంచం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు. 'నాటు నాటు'తో తెలుగు ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఈ స్టార్​ డైరెక్టర్​ ప్రస్తుతం ఖాళీ లేకుండా మరో మాస్టర్​పీస్​ను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. సూపర్​ స్టార్​ మహేశ్​ బాబుతో అడ్వెంచర్​ మూవీని తెరకక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో జక్కన్నకు సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది.

Rajamouli oppo Ad : మనం దర్శక ధీరుడిని తెర వెనక ఉండి కథను నడిపించడాన్నే చూసుంటాం. కానీ ఆయన అప్పుడప్పుడు సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి తళుక్కన మెరుస్తుంటారు. 'సై','రైంబో','ఈగ', 'బాహుబలి', 'మజ్ను', 'ఆర్​ఆర్​ఆర్'​ లాంటి సినిమాల్లో కాసేపు స్క్రీన్​పై కనిపించి అలరించారు. అయితే ఆయన్ను పూర్తి నిడివిలో తెరపై చూసింది మాత్రం అరుదే. అయితే తాజాగా ఆయన ఓ యాడ్​ షూట్​లో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇటీవలే ప్రముఖ మొబైల్​ తయారీ సంస్థ ఒప్పో.. రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసిడర్​గా చేసుకుంది. ఈ క్రమంలో తమ కొత్త ఫొన్​ ప్రమోషన్ కోసం జక్కన్నపై ఓ యాడ్​ను షూట్ చేశారు. అందులో రాజమౌళి ఓ న్యూ లుక్​లో కనిపించారు. ఎప్పుడూ సింపుల్​గా కనిపించే ఆయన.. ఇందులో మరింత స్టైలిష్​గా కనిపించడం వల్ల అభిమనులు ఔరా అంటున్నారు. ఈ లుక్​లో జక్కన్న సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Rajamouli Movies : ఇక ఆయన్​ అప్​కమింగ్​ ప్రాజెక్ట్స్​ విషయానికి వస్తే.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో బిగ్గెస్ట్​ బ్లాక్‌ బస్టర్‌ను ఇండస్ట్రీకి అందించిన జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని 'ఆస్కార్‌' వరకు తీసుకెళ్లారు. జూనియర్​ ఎన్​టీఆర్​, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని అద్భుతాలను సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి ఇప్పుడు.. సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​తో పాటు ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయని సమాచారం. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సినీ వర్గాల టాక్​. ఇక రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.