ETV Bharat / entertainment

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

author img

By

Published : Jul 6, 2022, 8:30 PM IST

Updated : Jul 6, 2022, 10:49 PM IST

Prime Minister Narendra Modi congratulates Ilaiyaraaja, pt usha, vijayendra prasad  on being nominated to the Rajya Sabha
రాజ్యసభకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

20:27 July 06

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

రాజ్యసభకు ఎంపికైన వారికి ట్విట్టర్​ వేదికగా.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోదీ పేర్కొన్నారు.

" విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచింది. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం. పి.టి.ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శం. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారులను పి.టి.ఉష తయారుచేశారు"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ఎంపిక కావడం పట్ల.. తెలుగు సినీ రచయుతల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

" మా తెలుగు సినీ రచయుతల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మన బాహుబలి విజయేంద్ర ప్రసాద్​ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైన అభినందనలు."

- డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, అధ్యక్షులు, ఉమార్జీ అనూరాధ ప్రధాన కార్యదర్శి, తెలుగు సినీ రచయితల సంఘం

విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల మెగాస్టార్​ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇళయరాజా ఎంపిక పట్ల సూపర్​స్టార్​ రజనీకాంత్​ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆలియా భట్​ ప్రెగ్నెంట్ అని తెలిసి.. కన్నీరు పెట్టుకున్న కరణ్​ జోహార్​

20:27 July 06

రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.

రాజ్యసభకు ఎంపికైన వారికి ట్విట్టర్​ వేదికగా.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోదీ పేర్కొన్నారు.

" విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచింది. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింబం. పి.టి.ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శం. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారులను పి.టి.ఉష తయారుచేశారు"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

రాజ్యసభకు విజయేంద్ర ప్రసాద్ ఎంపిక కావడం పట్ల.. తెలుగు సినీ రచయుతల సంఘం హర్షం వ్యక్తం చేసింది.

" మా తెలుగు సినీ రచయుతల సంఘం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, మన బాహుబలి విజయేంద్ర ప్రసాద్​ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సీట్ ఇచ్చి గౌరవించడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైన అభినందనలు."

- డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, అధ్యక్షులు, ఉమార్జీ అనూరాధ ప్రధాన కార్యదర్శి, తెలుగు సినీ రచయితల సంఘం

విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల మెగాస్టార్​ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇళయరాజా ఎంపిక పట్ల సూపర్​స్టార్​ రజనీకాంత్​ సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆలియా భట్​ ప్రెగ్నెంట్ అని తెలిసి.. కన్నీరు పెట్టుకున్న కరణ్​ జోహార్​

Last Updated : Jul 6, 2022, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.