ETV Bharat / entertainment

షూటింగ్‌లో గాయపడ్డ ప్రముఖ నటుడు.. ఆందోళనలో అభిమానులు!

author img

By

Published : Jun 26, 2023, 1:47 PM IST

Updated : Jun 26, 2023, 2:06 PM IST

Prithviraj Sukumaran Injured : ప్రముఖ మలయాళ నటుడు పృథ్విరాజ్​ సుకుమారన్ షూటింగ్​లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన గాయానికి వైద్యులు శస్త్ర చికిత్స చేయనున్నారు. ​

Prithviraj Sukumaran Injured
Prithviraj Sukumaran Injured

Prithviraj Sukumaran Accident : ప్రముఖ మలయాళ నటుడు షూటింగ్​లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'విలాయత్‌ బుద్ద' చిత్రీకరణలో సెట్​లో ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. గాయం తీవ్రత కారణంగా ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయానికి శస్త్రచికిత్స కూడా చేయనున్నారు. గాయం కారణంగా పృథ్విరాజ్​ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన 'విలాయత్‌ బుద్ద' సినిమాలో నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు.. జయన్ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అను మోహన్, ప్రియంవద కృష్ణన్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న సలార్​ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు పృథ్విరాజ్​. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్​ 28న ప్రేక్షకుల మందుకు రానుంది.

మరో సినిమాకు ప్రభాస్​ గ్రీన్ సిగ్నల్..
'ఆదిపురుష్'​ సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రభాస్​.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్​ కే' కూడా ఫుల్​ స్పీడ్​లో చిత్రీకరణ జరుపుకుంటోంది. డైరెక్టర్​ మారుతితో కూడా​ ఓ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్​రెడ్డి డైరెక్టర్​తో స్పిరిట్​ తెరకెక్కుతోంది. తాజాగా ప్రభాస్​ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్​లో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్​ వినిపిస్తోంది. ఓ ప్రముఖ డైరెక్టర్​తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు నిర్మాణ సంస్థగాని.. ఇటు ప్రభాస్​ అధికారికంగా స్పందించలేదు. త్వరలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఫుల్​ స్పీడ్​లో ఓజీ షూటింగ్​.. 50 % కంప్లీట్​..
పవన్​ కల్యాణ్ సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలే పెంచుతోంది. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 50 శాతం చిత్రీకరణం పూర్తి చేసుకుంది. తాజాగా హైదారాబాద్​లో 3వ షెడ్యూల్​ పూర్తి చేసుకున్నట్లు మూవీ యూనిట్​ వెల్లడించింది. వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్​ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పవన్​ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్​ మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్​ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్​, ప్రకాశ్​ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​.

Prithviraj Sukumaran Accident : ప్రముఖ మలయాళ నటుడు షూటింగ్​లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'విలాయత్‌ బుద్ద' చిత్రీకరణలో సెట్​లో ఓ ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. గాయం తీవ్రత కారణంగా ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయానికి శస్త్రచికిత్స కూడా చేయనున్నారు. గాయం కారణంగా పృథ్విరాజ్​ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన 'విలాయత్‌ బుద్ద' సినిమాలో నటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు.. జయన్ నంబియార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అను మోహన్, ప్రియంవద కృష్ణన్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న సలార్​ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు పృథ్విరాజ్​. ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్​ ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్​ 28న ప్రేక్షకుల మందుకు రానుంది.

మరో సినిమాకు ప్రభాస్​ గ్రీన్ సిగ్నల్..
'ఆదిపురుష్'​ సినిమాతో మంచి విజయం అందుకున్న ప్రభాస్​.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్​ కే' కూడా ఫుల్​ స్పీడ్​లో చిత్రీకరణ జరుపుకుంటోంది. డైరెక్టర్​ మారుతితో కూడా​ ఓ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్​రెడ్డి డైరెక్టర్​తో స్పిరిట్​ తెరకెక్కుతోంది. తాజాగా ప్రభాస్​ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలోని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్​లో ఓ సినిమా చేస్తున్నట్లు టాక్​ వినిపిస్తోంది. ఓ ప్రముఖ డైరెక్టర్​తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అటు నిర్మాణ సంస్థగాని.. ఇటు ప్రభాస్​ అధికారికంగా స్పందించలేదు. త్వరలో ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఫుల్​ స్పీడ్​లో ఓజీ షూటింగ్​.. 50 % కంప్లీట్​..
పవన్​ కల్యాణ్ సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న 'ఓజీ' మూవీ ప్రస్తుతం అభిమానుల్లో భారీ అంచనాలే పెంచుతోంది. శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 50 శాతం చిత్రీకరణం పూర్తి చేసుకుంది. తాజాగా హైదారాబాద్​లో 3వ షెడ్యూల్​ పూర్తి చేసుకున్నట్లు మూవీ యూనిట్​ వెల్లడించింది. వచ్చే నెలలో తదుపరి షెడ్యూల్​ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో పవన్​ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్​ మోహన్ నటిస్తోంది. ఇమ్రాన్​ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్​, ప్రకాశ్​ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై తెరకెక్కిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్​లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​.

Last Updated : Jun 26, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.