Emergency Teaser : బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా టీజర్ను మూవీ యూనిట్ శనివారం విడుదల చేసింది. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. టీజర్లో 'ఇండియా ఈజ్ ఇందిరా.. ఇందిరా ఈజ్ ఇండియా' అన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది.
ఈ సినిమాకు కంగనా రనౌత్ స్వయంగా తానే దర్శకత్వం వహిస్తున్నారు. మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న 'ఎమర్జెన్సీ' చిత్రానికి కంగనా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో దేశంలోని ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన కంగనా.. తాజాగా ఈ చిత్ర టీజర్ను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పే కంగనా ఈ సినిమాలో దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎలా చూపిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాతో 1975 నాటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని దాదాపు 48 ఏళ్ల తర్వాత ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తున్నారు కంగనా. దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏర్పడడం 'మన చరిత్రలో అది ఓ చీకటి దశ' అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ లాంటి సినిమాకు దర్శకత్వం వహించడం. అందులో ఇందిరా గాంధీ పాత్రలో నటించడాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారని అన్నారు. కాగా ఇటీవలె 'ఎమర్జెన్సీ' సినిమా చూసి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారని కంగనా తెలిపారు.