ETV Bharat / entertainment

ప్రభాస్​తో 'విక్రమ్​' డైరెక్టర్ సీక్రెట్​ చర్చలు.. కాంబోలో సినిమా రానుందా?

author img

By

Published : Nov 26, 2022, 2:06 PM IST

పాన్​ఇండియా స్టార్​గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్‌ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తమిళ యువ దర్శకుడు లోకేశ్​ కనగరాజ్‌.. డార్లింగ్​తో చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే వీరి కాంబోలో సినిమా రాబోతుందట.

prabhas
ప్రభాస్‌

Prabhas Lokesh Kanagaraj: 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌. ఈ సినిమాతో రెబల్ స్టార్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆ చిత్రం త‌ర్వాత వ‌చ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్​లు రావడంతో డార్లింగ్​ ఆశలన్నీ 'ఆదిపురుష్‌' సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.

తాజాగా కమల్​హాసన్​కు​ 'విక్రమ్‌' సినిమా రూపంలో బ్లాక్​బస్టర్​ హిట్​ అందించిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్​.. ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డార్లింగ్​తో కలిసి ఆయన సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అదేగానీ నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్​కు పండగే. ఈ విషయం తెలుసుకున్న​ ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కాంబో విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Prabhas Lokesh Kanagaraj: 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్‌. ఈ సినిమాతో రెబల్ స్టార్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఆ చిత్రం త‌ర్వాత వ‌చ్చిన 'సాహో', 'రాధేశ్యామ్' చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. రెండు బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్​లు రావడంతో డార్లింగ్​ ఆశలన్నీ 'ఆదిపురుష్‌' సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశారు.

తాజాగా కమల్​హాసన్​కు​ 'విక్రమ్‌' సినిమా రూపంలో బ్లాక్​బస్టర్​ హిట్​ అందించిన తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్​.. ప్రభాస్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. డార్లింగ్​తో కలిసి ఆయన సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అదేగానీ నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్​కు పండగే. ఈ విషయం తెలుసుకున్న​ ఫ్యాన్స్ వీరిద్దరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కాంబో విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇవీ చదవండి: చూసేందుకు 'భయమే' కానీ వినోదమే.. టాలీవుడ్​లో కొత్త హంగులతో హారర్​​ చిత్రాలు!

టాలీవుడ్​లో అత్యధిక రెమ్యునరేషన్​ తీసుకుంటున్న స్టార్స్​ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.