ETV Bharat / crime

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Mar 2, 2021, 9:32 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

yadadri police stopped illegal transportation of ration rice
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు వీరన్న, గుగులోతు బుజ్జి తమ సొంత వాహనంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యత్నించారు.

ఈ క్రమంలో ధర్మారం గ్రామ శివారులో తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ వాహనాన్ని ఆపారు. ట్రాలీలో తనిఖీ చేయగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అడ్డగూడూర్ ఎస్సై కేసు నమోదు చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గుగులోతు వీరన్న, గుగులోతు బుజ్జి తమ సొంత వాహనంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యత్నించారు.

ఈ క్రమంలో ధర్మారం గ్రామ శివారులో తనిఖీలు చేస్తున్న పోలీసులు ఈ వాహనాన్ని ఆపారు. ట్రాలీలో తనిఖీ చేయగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అడ్డగూడూర్ ఎస్సై కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.