ETV Bharat / crime

అప్పు తీర్చమన్నందుకు వాలంటీర్​ను చంపేశారు..

author img

By

Published : May 20, 2022, 4:45 PM IST

Volunteer Murder: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు వాలంటీర్​పై ఓ తండ్రీకుమారుడు దాడి చేశారు. దీంతో.. అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈ దారుణం ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.

Volunteer Murder
వాలంటీర్​ను చంపిన తండ్రీకొడుకు

Volunteer Murder: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి మారిస్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు.. వాలంటీరుపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారిస్​పేటలోని 24వ వార్డులో వాలంటీర్ గా సందీప్(22) పనిచేస్తున్నాడు. రోహిత్ అనే వ్యక్తికి సందీప్ రూ. 2 వేలు ఇచ్చాడు. కొన్ని రోజులకు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్ అడిగాడు.

దీంతో.. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. రోహిత్‌ తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సందీప్‌పై దాడిచేశారు. గుండెపై బలంగా కొట్టడంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోహిత్‌, అతని తండ్రి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. సందీప్ తండ్రి ఇది వరకే మృతిచెందగా, తల్లికి మాటలు రావు. దీంతో.. వాలంటీర్​గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

Volunteer Murder: ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి మారిస్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకు.. వాలంటీరుపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారిస్​పేటలోని 24వ వార్డులో వాలంటీర్ గా సందీప్(22) పనిచేస్తున్నాడు. రోహిత్ అనే వ్యక్తికి సందీప్ రూ. 2 వేలు ఇచ్చాడు. కొన్ని రోజులకు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని సందీప్ అడిగాడు.

దీంతో.. ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే.. రోహిత్‌ తన తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సందీప్‌పై దాడిచేశారు. గుండెపై బలంగా కొట్టడంతో సందీప్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రోహిత్‌, అతని తండ్రి వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. సందీప్ తండ్రి ఇది వరకే మృతిచెందగా, తల్లికి మాటలు రావు. దీంతో.. వాలంటీర్​గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

ఇవీ చదవండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకం: సుప్రీంకు సిర్పూర్కర్ కమిషన్​ నివేదిక

'జ్ఞాన్​వాపీ మసీదు కేసు'పై సుప్రీం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.