రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. రెండో ఫ్లాట్ఫామ్ వద్ద షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
యువకుడు చనిపోవడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.