ETV Bharat / crime

అదుపు తప్పి కారు బోల్తా.. ఇద్దరు యువకులు దుర్మరణం

author img

By

Published : Mar 30, 2021, 3:34 PM IST

సంగారెడ్డి జిల్లా ఉప్పర్​పల్లి తండా శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు యువకులు మృతి చెందారు. సోమవారం రాత్రి కారు అదుపు తప్పి ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు.

two young men dead in road accident, sangareddy road accident
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి, సంగారెడ్డి రోడ్డు ప్రమాదం

కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్​పల్లి తండా శివారులో సోమవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటక కలబుర్గి జిల్లా చించోలి తాలూకా కాల్బావి తండాకు చెందిన చేతన్ జాదవ్, ఆనంద్ పవార్ తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనా స్థలాన్ని చిరాగ్​పల్లి ఎస్సై కాశీనాథ్ పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం ఉప్పర్​పల్లి తండా శివారులో సోమవారం రాత్రి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కర్ణాటక కలబుర్గి జిల్లా చించోలి తాలూకా కాల్బావి తండాకు చెందిన చేతన్ జాదవ్, ఆనంద్ పవార్ తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను జహీరాబాద్ వైద్యవిధాన పరిషత్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనా స్థలాన్ని చిరాగ్​పల్లి ఎస్సై కాశీనాథ్ పరిశీలించి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: క్షుద్రపూజల ఉదంతంలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.