ETV Bharat / crime

Missing : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యం

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యమైనట్లు సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో కేసులు నమోదయ్యాయి. బయట వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు సదరు మహిళల భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : May 31, 2021, 10:25 PM IST

woman missing, women missing in sangareddy
మహిళలు అదృశ్యం, మహిళలు మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​కు చెందిన శరత్​కుమమార్ స్థానికంగా మెకానిక్​ పని చేస్తుండేవాడు. ఈనెల 30న అతను పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి భార్య భవాని కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య అదృశ్యంపై నారాయణ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో.. పటాన్​చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ స్థానికంగా వడ్రంగి పనులు చేస్తుంటాడు. ఈనెల 29న పనికి వెళ్లిన అతను.. తన భార్య కనిపించడం లేదని పిల్లలు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు. చుట్టుపక్కల వెతికినా ఆమె దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అదృశ్యంపై రవితేజ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు మహిళల కోసం గాలిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​కు చెందిన శరత్​కుమమార్ స్థానికంగా మెకానిక్​ పని చేస్తుండేవాడు. ఈనెల 30న అతను పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసే సరికి భార్య భవాని కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య అదృశ్యంపై నారాయణ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పటాన్ చెరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో ఘటనలో.. పటాన్​చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన ప్రశాంత్ కుమార్ స్థానికంగా వడ్రంగి పనులు చేస్తుంటాడు. ఈనెల 29న పనికి వెళ్లిన అతను.. తన భార్య కనిపించడం లేదని పిల్లలు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు. చుట్టుపక్కల వెతికినా ఆమె దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అదృశ్యంపై రవితేజ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు మహిళల కోసం గాలిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.