ETV Bharat / crime

Students Died: విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా...

చిన్న చిన్న సరదాలు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంటాయి. సరదాగా ఈత కోసం వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. హిమాయత్‌నగర్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాసి తిరిగి వస్తుండగా సరదా కోసం ఈతకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. పరీక్ష రాసి వస్తానని చెప్పి వెళ్లిన పిల్లలు.. మృతదేహాలుగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.

author img

By

Published : Oct 26, 2021, 1:24 PM IST

crime news
crime news

సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని వెంకటాపూర్ చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మెుదలవడంతో సజ్జన్‌పల్లికి చెందిన ఆంజనేయులు హిమాయత్‌నగర్‌లో పరీక్ష రాశాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కలిసిన పవన్, విట్టల్ అనే తోటి స్నేహితులను... వెంకటాపూర్‌లోని ఈసీ వాగు కత్వ వద్ద ఈత కొడదామని బైక్‌ ఎక్కించుకున్నాడు. ముగ్గురు కలసి వాగులోకి దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో పవన్, విట్టల్ ఇద్దరు నీటమునిగారు. అది గమనించిన ఆంజనేయులు రక్షించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారిని రక్షించమని అడగగా సమయానికి ఎవరూ లేకపోవడంతో పవన్, విట్టల్ గల్లంతయినట్లు ఆంజనేయులు పేర్కొన్నాడు.

సోమవారం సాయంత్రం చీకటిపడటంతో గల్లంతైన ఇద్దరి యువకులను వాగులో గుర్తించలేకపోయారు. ఇవాళ ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.

సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని వెంకటాపూర్ చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మెుదలవడంతో సజ్జన్‌పల్లికి చెందిన ఆంజనేయులు హిమాయత్‌నగర్‌లో పరీక్ష రాశాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కలిసిన పవన్, విట్టల్ అనే తోటి స్నేహితులను... వెంకటాపూర్‌లోని ఈసీ వాగు కత్వ వద్ద ఈత కొడదామని బైక్‌ ఎక్కించుకున్నాడు. ముగ్గురు కలసి వాగులోకి దిగారు. సరదాగా గడుపుతున్న సమయంలో పవన్, విట్టల్ ఇద్దరు నీటమునిగారు. అది గమనించిన ఆంజనేయులు రక్షించే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారిని రక్షించమని అడగగా సమయానికి ఎవరూ లేకపోవడంతో పవన్, విట్టల్ గల్లంతయినట్లు ఆంజనేయులు పేర్కొన్నాడు.

సోమవారం సాయంత్రం చీకటిపడటంతో గల్లంతైన ఇద్దరి యువకులను వాగులో గుర్తించలేకపోయారు. ఇవాళ ఉదయం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు మృతదేహాలను వెలికితీశారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి: Suicide attempt: డీఎస్పీ కార్యాలయం ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.