ETV Bharat / crime

వేరు వేరు గదుల్లో ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా.! - రేణిగుంటలో ఇద్దరు వ్యక్తుల ఆత్మహత్య

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు.. వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

suicide in ap
వేరు వేరు గదుల్లో ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా.!
author img

By

Published : Mar 16, 2021, 10:32 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గదుల్లో వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం వారు వేర్వేరుగా గదులు తీసుకున్నారు. పురుగుల మందు తాగి వెంకటేశ్​ ఆత్మహత్య చేసుకోగా.. అనిత ఉరివేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సహజీవనం, వివాహేతర సంబంధం లాంటి కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ 15 ఏళ్లుగా తిరుపతిలోనే నివాసముంటున్నాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి కాగా... అనిత స్వస్థలం తిరుపతిలోని సత్యనారాయణపురమని పోలీసులు వెల్లడించారు.

ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గదుల్లో వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం వారు వేర్వేరుగా గదులు తీసుకున్నారు. పురుగుల మందు తాగి వెంకటేశ్​ ఆత్మహత్య చేసుకోగా.. అనిత ఉరివేసుకుంది.

ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సహజీవనం, వివాహేతర సంబంధం లాంటి కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్ 15 ఏళ్లుగా తిరుపతిలోనే నివాసముంటున్నాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి కాగా... అనిత స్వస్థలం తిరుపతిలోని సత్యనారాయణపురమని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి ఓటును తొలగించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.