Drugs Seized: హైదరాబాద్ మెహదీపట్నంలోని మాదకద్రవ్యాలు కలిగిఉన్న ఇద్దరిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా రిలయన్స్ కోహినూర్ అపార్ట్మెంట్లోని షోయబ్ ఖాన్ ఇంటిపై దాడులు చేసి మత్తు పదార్థాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మెహదీపట్నంలో నివాసముంటున్న ముబాసిర్ అహ్మద్ను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. అతని అనుచరుడు అర్బాజ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. షోయబ్ చెప్పినందుకే తాము డార్క్ వెబ్ సైట్ల ద్వారా మత్తు పదార్థాలు తెప్పించినట్టు నిందితులు ఎక్సైజ్ పోలీసులకు తెలిపారు.
పరారీలో ఉన్న షోయబ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి మూడు చరవాణులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: foreign currency seized in Shamshabad : శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ, బంగారం పట్టివేత