ETV Bharat / crime

Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

author img

By

Published : Jan 26, 2022, 4:18 PM IST

Updated : Jan 26, 2022, 5:33 PM IST

ganja seized in sangareddy
ganja seized in sangareddy

16:16 January 26

రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Ganja Seized : సంగారెడ్డి జిల్లాలో భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు కోట్ల విలువైన వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కి లారీలో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులు అందింది. ఈ మేరకు నిఘాపెట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద ఉదయం 4 గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణా ముఠాసభ్యులు షేక్ సలీం, అజీజ్ ఖాన్​ సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన ఆజాద్​ అనే వ్యక్తి.. నిందితులు ఇద్దరితో రెండు లక్షలకు బేరం మాట్లాడుకున్నారని.. అడ్వాన్స్​గా రూ.50 వేలు ఇచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. లారీలో మొత్తం 500 ప్యాకెట్లు ఉన్నాయని.. ఒక్కోటి రెండు కిలోలు ఉందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సహా ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్​కుమార్​, ఇతర సిబ్బందిని అభినందించారు.

"పక్కా సమాచారంతో ఈ ఉదయం నాలుగు గంటలకు వెయ్యి కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ సుమారు రెండు కోట్లు ఉంటుంది. ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్​ చేశాం. ప్రధాన నిందితుడు మహారాష్ట్రకు చెందినవాడు."

- రమణకుమార్​, సంగారెడ్డి ఎస్పీ

ఇదీచూడండి:

16:16 January 26

రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Ganja Seized : రూ.2 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

Ganja Seized : సంగారెడ్డి జిల్లాలో భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు కోట్ల విలువైన వెయ్యి కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కి లారీలో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులు అందింది. ఈ మేరకు నిఘాపెట్టిన పోలీసులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది వద్ద ఉదయం 4 గంటల సమయంలో గంజాయి అక్రమ రవాణా ముఠాసభ్యులు షేక్ సలీం, అజీజ్ ఖాన్​ సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన ఆజాద్​ అనే వ్యక్తి.. నిందితులు ఇద్దరితో రెండు లక్షలకు బేరం మాట్లాడుకున్నారని.. అడ్వాన్స్​గా రూ.50 వేలు ఇచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. లారీలో మొత్తం 500 ప్యాకెట్లు ఉన్నాయని.. ఒక్కోటి రెండు కిలోలు ఉందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సహా ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్​కుమార్​, ఇతర సిబ్బందిని అభినందించారు.

"పక్కా సమాచారంతో ఈ ఉదయం నాలుగు గంటలకు వెయ్యి కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నాం. వీటి విలువ సుమారు రెండు కోట్లు ఉంటుంది. ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్​ చేశాం. ప్రధాన నిందితుడు మహారాష్ట్రకు చెందినవాడు."

- రమణకుమార్​, సంగారెడ్డి ఎస్పీ

ఇదీచూడండి:

Last Updated : Jan 26, 2022, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.