ETV Bharat / crime

గృహరుణాల మోసం కేసులో.. బ్యాంకు మేనేజరు సహా 12మందికి జైలు శిక్ష

author img

By

Published : Mar 11, 2022, 6:26 PM IST

CBI Special court Judgement: తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో గృహ రుణాలు పొంది మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బ్యాంకు మేనేజరు సహా పన్నెండు మందికి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధించింది.

CBI Special court
సీబీఐ

CBI Special court Judgement: గృహరుణాల పేరుతో తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపి తీర్పునిచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బొల్లారం శాఖలో 2002 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు గృహ రుణాల పేరిట 98 లక్షల 43 వేల రూపాయల మోసం జరిగినట్లు 2004లో సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పూచీకత్తులు, డాక్యుమెంట్లతో రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు నష్టం జరిగినట్లు దర్యాప్తులో సీబీఐ తేల్చింది.

CBI Special court latest news: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి బ్రాంచి మేనేజరు కె.రాజారావు సహా 12 మందిపై 2006లో సీబీఐ మూడు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం 12 మందిని దోషులుగా తేల్చి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

CBI Special court news: బ్యాంకు మేనేజరు రాజారావుకు ఐదేళ్ల జైలు శిక్ష, 2 లక్షల 25వేల రూపాయల జరిమానా విధించింది. రుణాలు తీసుకున్న శ్రీధర్, కె.రాణి, విస్లావత్ కుమార్, వి.సుశీల్ సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, ఎన్.రాంబాబు, వెంకటాయప్ప, డి.అనిల్ కుమార్​లకు మూడేళ్ల జైలు శిక్ష, 75వేల రూపాయల ఫైన్ వేసింది. డీఎంకే నాయుడుకు మూడేళ్ల జైలు, లక్ష 25 వేల రూపాయలు.. బి.రామకృష్ణ ప్రసాద్​కు మూడేళ్ల జైలు, 50వేల రూపాయలు.. వి.యాదగిరికి మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధించింది.

ఇదీ చదవండి:నకిలీ ఖాతాలు సృష్టించి రూ.1.15 కోట్లను కాజేసిన బ్యాంకు అధికారులు..

CBI Special court Judgement: గృహరుణాల పేరుతో తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపి తీర్పునిచ్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బొల్లారం శాఖలో 2002 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు గృహ రుణాల పేరిట 98 లక్షల 43 వేల రూపాయల మోసం జరిగినట్లు 2004లో సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పూచీకత్తులు, డాక్యుమెంట్లతో రుణాలు పొంది తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుకు నష్టం జరిగినట్లు దర్యాప్తులో సీబీఐ తేల్చింది.

CBI Special court latest news: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పటి బ్రాంచి మేనేజరు కె.రాజారావు సహా 12 మందిపై 2006లో సీబీఐ మూడు ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం 12 మందిని దోషులుగా తేల్చి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

CBI Special court news: బ్యాంకు మేనేజరు రాజారావుకు ఐదేళ్ల జైలు శిక్ష, 2 లక్షల 25వేల రూపాయల జరిమానా విధించింది. రుణాలు తీసుకున్న శ్రీధర్, కె.రాణి, విస్లావత్ కుమార్, వి.సుశీల్ సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, ఎన్.రాంబాబు, వెంకటాయప్ప, డి.అనిల్ కుమార్​లకు మూడేళ్ల జైలు శిక్ష, 75వేల రూపాయల ఫైన్ వేసింది. డీఎంకే నాయుడుకు మూడేళ్ల జైలు, లక్ష 25 వేల రూపాయలు.. బి.రామకృష్ణ ప్రసాద్​కు మూడేళ్ల జైలు, 50వేల రూపాయలు.. వి.యాదగిరికి మూడేళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా విధించింది.

ఇదీ చదవండి:నకిలీ ఖాతాలు సృష్టించి రూ.1.15 కోట్లను కాజేసిన బ్యాంకు అధికారులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.