ETV Bharat / crime

attack on acp: ఏసీపీ వేళ్లు నరికేసిన వ్యాపారులు

రహదారిపై అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నవారిని ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై చిరు వ్యాపారులు(Peddler) దాడి చేశారు. ఈ ఘటనలో ఓ ఏసీపీ చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

author img

By

Published : Sep 1, 2021, 2:51 PM IST

attack
attack

మహారాష్ట్ర ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మాజివడా అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.


ఏం జరిగింది?

కొద్ది రోజులుగా.. అక్రమంగా దుకాణాలు ఏర్పరచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా.. వారి మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో ఏసీపీ కల్పితా పింపుల్​పై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఏసీపీని హుటాహుటిన ఘోడ్​బందర్​లోని ప్రైవేట్​ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఏసీపీ పక్కన ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి అనంతరం వీధి వ్యాపారులు పెద్దఎత్తున రహదారిపైకి చేరుకున్నారు.


కఠిన చర్యలు తీసుకుంటాం..

ఏసీపీపై దాడి కేసులో నిందితుడు అమర్జీత్​ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ తెలిపారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్ అధికారుల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: Young Woman Suicide: ఆ పని తప్పని చెప్పినందుకు ఉరేసుకుని చనిపోయింది!

మహారాష్ట్ర ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. పోలీసులపై దాడి చేశారు. ఈ ఘటనలో మాజివడా అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.


ఏం జరిగింది?

కొద్ది రోజులుగా.. అక్రమంగా దుకాణాలు ఏర్పరచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా.. వారి మధ్య ఘర్షణ తలెత్తింది.

ఈ క్రమంలో ఏసీపీ కల్పితా పింపుల్​పై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఏసీపీని హుటాహుటిన ఘోడ్​బందర్​లోని ప్రైవేట్​ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఏసీపీ పక్కన ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి అనంతరం వీధి వ్యాపారులు పెద్దఎత్తున రహదారిపైకి చేరుకున్నారు.


కఠిన చర్యలు తీసుకుంటాం..

ఏసీపీపై దాడి కేసులో నిందితుడు అమర్జీత్​ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ తెలిపారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్ అధికారుల భద్రతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి: Young Woman Suicide: ఆ పని తప్పని చెప్పినందుకు ఉరేసుకుని చనిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.