ETV Bharat / crime

లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

author img

By

Published : Mar 23, 2021, 7:28 AM IST

Updated : Mar 23, 2021, 9:00 AM IST

three-died-on-the-spot-when-lorry-hits-a-bike-at-pedda-amberpet-in-hyderabad
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

07:26 March 23

హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్ వద్ద ప్రమాదం

undefined

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్​పేట్  ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకాల నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్​ ప్రభాకర్ (30)తో పాటు తండ్రి ఉపేంద్ర నాథ్ (45), కొడుకు రోషిక్ (27) అక్కడికక్కడే మృతి చెందారు.

ఆంధ్రా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ-కారు మధ్యలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కొత్తపేటకు చెందిన వారిగా  గుర్తించారు. వీరు ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

07:26 March 23

హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్ వద్ద ప్రమాదం

undefined

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్​మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్​పేట్  ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనకాల నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్​ ప్రభాకర్ (30)తో పాటు తండ్రి ఉపేంద్ర నాథ్ (45), కొడుకు రోషిక్ (27) అక్కడికక్కడే మృతి చెందారు.

ఆంధ్రా నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీ-కారు మధ్యలో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కొత్తపేటకు చెందిన వారిగా  గుర్తించారు. వీరు ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్లకు వెళ్లి వస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Mar 23, 2021, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.