ETV Bharat / crime

తాళం వేసిన ఇంట్లో చోరీ.. ఏమేం ఎత్తుకెళ్లారంటే..?

author img

By

Published : Jun 25, 2021, 10:55 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో.. దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. పలు బంగారు, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.

Theft in a locked house
తాళం వేసిన ఇంట్లో చోరీ

గుర్తు తెలియని దుండగులు.. తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో జరిగింది. ఓ ఇంట్లో నుంచి రూ. 2.40 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఓ బైక్.. మరో ఇంట్లో నుంచి రూ. 60 వేలు నగదు, ఓ బంగారు ఉంగరం​ అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. యజమాని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గుర్తు తెలియని దుండగులు.. తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో జరిగింది. ఓ ఇంట్లో నుంచి రూ. 2.40 లక్షల నగదు, 70 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఓ బైక్.. మరో ఇంట్లో నుంచి రూ. 60 వేలు నగదు, ఓ బంగారు ఉంగరం​ అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. యజమాని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో యువకుడి దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.