ETV Bharat / crime

భూ వివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు

author img

By

Published : Mar 5, 2021, 2:36 PM IST

రంగారెడ్డి జిల్లా టంగుటూరు గ్రామంలో దారుణం జరిగింది. భూ వివాదంలో ఓ తమ్ముడు అతని అన్ననే కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

The younger brother who killed Anna in a land dispute in rangareddy district
భూ వివాదంలో అన్నను హతమార్చిన తమ్ముడు

భూ వివాదంలో ఓ వ్యక్తిని అతని తమ్ముడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది.

జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య (50), అతని తమ్ముళ్లు పాండు, రాజుల మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మరోమారు గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన పాండు అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

భూ వివాదంలో ఓ వ్యక్తిని అతని తమ్ముడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో జరిగింది.

జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య (50), అతని తమ్ముళ్లు పాండు, రాజుల మధ్య కొంతకాలంగా భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మరోమారు గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన పాండు అతనిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ఇదీ చదవండి: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల దాడులు.. మారణాయుధాలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.