జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినికి 7 నెలల గర్భం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెను శిశు సంక్షేమ అధికారులు స్టేట్ హోమ్కు తరలించారు. ఆమె తల్లితండ్రులు ముంబయిలో ఉంటుండగా... ఆమె అక్క ఇంట్లో ఉంటూ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది.
లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు తెరవటంతో ఈ మధ్యనే పాఠశాలలో చేరింది. ఆమె అనారోగ్యంగా కనిపించటంతో ఉపాధ్యాయులు శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యార్థినిని ఇంటికి పంపారు. శిశు సంక్షేమ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కడుపులో 7 నెలల గర్భం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీయగా ఆమె బావ ఈ పని చేసినట్లు అధికారులకు తెలిపింది.
ఇదీ చదవండి: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం తెరాస కైవసం