వేగంగా వచ్చిన లారీ.. రహదారిపై ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం మేడ్చల్ జిల్లా కీసర పీఎస్ పరిధిలోని ఓఆర్ఆర్పై జరిగింది.
మృతుడు లింగంపల్లికి చెందిన రాంరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Crime: చికెన్ ఉద్దెర ఇవ్వలేదని కత్తితో దాడి