హైదరాబాద్లో గొలుసు దొంగల ఆగడాలు తగ్గడంలేదు. ఆభరణాలు ధరించిన మహిళలు కన్పిస్తే చాలు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కేశవనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు గొలుసును ఎత్తుకెళ్లాడు.
స్థానిక భాను నగర్ కాలనీకి చెందిన మాలతి అనే మహిళా 3 తులాల బంగారు గొలుసును మధ్యాహ్నం అందరూ ఉండగానే దొంగిలించాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: అనిశా అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలాలు