ETV Bharat / crime

తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం

author img

By

Published : Feb 7, 2021, 9:29 AM IST

తిరుమలలో మహారాష్ట్రకు చెందిన భక్తులకు.. వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ ఓ దళారీ మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం
తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం

తిరుమలలో భక్తులను మోసగించిన ఓ దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ.. శివకుమార్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ భక్తుల నుంచి 4,500 రూపాయల నగదును ఫోన్​పే ద్వారా తీసుకున్నాడు.

అనంతరం వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చి.. దర్శనానికి పంపించాడు. వీఐపీ బ్రేక్ టికెట్లు బదులు.. సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడంతో బాధితులు.. శివకుమార్​పై తితిదే విజిలెన్స్​కు ఫిర్యాదు చేశారు. దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: అనుభవ సారం.. అక్షర హారం

తిరుమలలో భక్తులను మోసగించిన ఓ దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ.. శివకుమార్ ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ భక్తుల నుంచి 4,500 రూపాయల నగదును ఫోన్​పే ద్వారా తీసుకున్నాడు.

అనంతరం వారికి ఉచిత దర్శనం టోకెన్లు ఇచ్చి.. దర్శనానికి పంపించాడు. వీఐపీ బ్రేక్ టికెట్లు బదులు.. సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడంతో బాధితులు.. శివకుమార్​పై తితిదే విజిలెన్స్​కు ఫిర్యాదు చేశారు. దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: అనుభవ సారం.. అక్షర హారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.