ETV Bharat / crime

ఏడీఈ కోసం వెళితే కంప్యూటర్ ఆపరేటర్​ చిక్కాడు! - ఏసీబీ దాడుల్లో దొరికిన ఏడీఈ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్

విద్యుత్​ శాఖ ఏడీఈ కోసం ఏసీబీ అధికారులు వెళితే... కంప్యూటర్ ఆపరేటర్ దొరికిన ఘటన... వికారాబాద్ జిల్లా తాండూర్​లో చోటుచేసుకుంది. లంచం ఇవ్వాలని డిమాండ్​ చేయగా... బాధితుడు అనిశాను ఆశ్రయించాడు.

thandur aisstant divissional engineer office computer operater caught in acb rides
ఏడీఈ కోసం దాడులు చేస్తే కంప్యూటర్ ఆపరేటర్​ దొరికాడు
author img

By

Published : Jan 28, 2021, 7:29 PM IST

వికారాబాద్ జిల్లా తాండూర్​ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ దొరికాడు. డబ్బులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్​కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సయ్యద్ ఫయాజ్​ తెలిపారు.

తాండూర్ మండలం మల్కాపూర్​లో నాపరాతి గనుల వ్యాపారం నిర్వహిస్తున్న ఖలీద్​... 74 హెచ్​పీ విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని 40 హెచ్​పీకి తగ్గించాలని ఆరు నెలల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.40 వేలు లంచం ఇస్తేనే పని జరుగుతుందని... ఏడీఈ రాందాస్, కంప్యూటర్​ ఆపరేటర్ సాబిల్​ తేల్చి చెప్పినట్టు బాదితుడు ఖలీద్​ తెలిపాడు. ఆఖరికి రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.20 వేలు ఇస్తానని బాధితుడు చెప్పాడు.

ఈ క్రమంలో బాధితుడు ఖలీద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు ఖలీద్ కార్యాలయానికి వెళ్లాడు. అదే సమయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. కానీ ఏడీఈ లేకపోవడం వల్ల... కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్​​కు ఇస్తుండగా పట్టుకున్నారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

వికారాబాద్ జిల్లా తాండూర్​ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. నాటకీయ పరిణామాల మధ్య లంచం తీసుకుంటూ కంప్యూటర్ ఆపరేటర్ దొరికాడు. డబ్బులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్​కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ సయ్యద్ ఫయాజ్​ తెలిపారు.

తాండూర్ మండలం మల్కాపూర్​లో నాపరాతి గనుల వ్యాపారం నిర్వహిస్తున్న ఖలీద్​... 74 హెచ్​పీ విద్యుత్ మోటార్ల సామర్థ్యాన్ని 40 హెచ్​పీకి తగ్గించాలని ఆరు నెలల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.40 వేలు లంచం ఇస్తేనే పని జరుగుతుందని... ఏడీఈ రాందాస్, కంప్యూటర్​ ఆపరేటర్ సాబిల్​ తేల్చి చెప్పినట్టు బాదితుడు ఖలీద్​ తెలిపాడు. ఆఖరికి రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.20 వేలు ఇస్తానని బాధితుడు చెప్పాడు.

ఈ క్రమంలో బాధితుడు ఖలీద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం డబ్బులు ఇచ్చేందుకు ఖలీద్ కార్యాలయానికి వెళ్లాడు. అదే సమయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. కానీ ఏడీఈ లేకపోవడం వల్ల... కంప్యూటర్ ఆపరేటర్ సాబిల్​​కు ఇస్తుండగా పట్టుకున్నారు.

ఇదీ చూడండి: నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.