జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణానికి చెందిన ముద్దాసి స్వాములు బైరంపల్లి శివారులో మినుము పంట వేశారు. పంటకు నీళ్లు పెట్టే విషయంలో స్వాములుకు అదే గ్రామానికి చెందిన తిక్కస్వామికి మధ్య వివాదం తలెత్తింది. గొడవ ముదిరి తోపులాటకు దారితీసింది. ఈ తోపులాటలో కిందపడ్డ స్వాములు తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
![farm water dispute in alampur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-01-07-garshanalo-teacher-mruthi-avb-ts10096_07022021090532_0702f_1612668932_709.jpg)
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు స్వాములు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి : వంతెనపై నుంచి పడిన సిమెంట్ లారీ.. ఇద్దరు మృతి