ETV Bharat / crime

ఆటో బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Feb 2, 2021, 7:32 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్- ఖమ్మం రహదారిపై ప్యాసింజర్​ ఆటో బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్​-ఖమ్మం రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ప్యాసింజర్​ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాటిన అంబులెన్స్​కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారంతా ఖమ్మం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు వరంగల్​-ఖమ్మం రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ప్యాసింజర్​ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హుటాటిన అంబులెన్స్​కు సమాచారం అందించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారంతా ఖమ్మం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: గొర్రెగుండంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.