పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని మంథని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ నుంచి 18 బెల్లం కాటన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టబడిన బెల్లం మూడున్నర క్వింటాళ్లు ఉంటుందని చెప్పారు.
గోదావరిఖని నుంచి మంథనివైపు కొందరు అక్రమంగా బెల్లాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద కాపుకాసిన ఎక్సైజ్ పోలీసులు ఓ ట్రాలీని పట్టుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పశ్నించగా.. సదరు బెల్లం గోదావరిఖని చెందిన ఓ వ్యాపారిదని చెప్పాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మాస్క్ ధరించని దుకాణదారులకు జరిమానా