ETV Bharat / crime

'మహిళలు, ఉద్యోగులపై దాడులు'... న్యాయవాదిపై పీడీ యాక్ట్!

author img

By

Published : Mar 20, 2021, 10:19 AM IST

మహిళలు, ఉద్యోగులపై దాడులు చేస్తూ.. వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాది సుభాష్​పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కానిస్టేబుల్​గా పనిచేసిన సుభాష్... ప్రస్తుతం ఎల్బీనగర్​లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. పలువురు మహిళల ఫిర్యాదులతో ఆయనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పీడీ చట్టం నమోదు చేసినట్లు వెల్లడించారు.

rachakonda-cp-mahesh-bhagwat-file-pd-act-on-advocate-in-hyderabad-district
మహిళలు, ఉద్యోగులపై దాడులు... న్యాయవాదిపై పీడీ యాక్టు!

మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని దాడులు, వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాది సుభాష్‌పై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ పీడీ చట్టం నమోదు చేశారు. గతంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్​గా పనిచేసిన సుభాష్... ప్రస్తుతం ఎల్బీనగర్‌ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులను, మహిళలను వేధిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వివాదస్పద భూమిని తన పేరు మీద రిజిస్టర్‌ చేయాలని సరూర్‌నగర్‌ సబ్‌రిజిస్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి... ఆమెపై దాడి చేశారని పేర్కొన్నారు. తను చెప్పినట్లు వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

బతుకమ్మ ఆడుతున్న మహిళలపై సుభాష్‌ దాడి చేసి... అసభ్య పదజాలంతో దూషించగా ఇదివరకే కేసు నమోదైందని వెల్లడించారు. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. సుభాష్​పై పీడీ చట్టం నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అత్యాచారం జరిగిన 17ఏళ్లకు ఫిర్యాదు

మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని దాడులు, వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాది సుభాష్‌పై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ పీడీ చట్టం నమోదు చేశారు. గతంలో పోలీసు శాఖలో కానిస్టేబుల్​గా పనిచేసిన సుభాష్... ప్రస్తుతం ఎల్బీనగర్‌ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ ఉద్యోగులను, మహిళలను వేధిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు.

పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వివాదస్పద భూమిని తన పేరు మీద రిజిస్టర్‌ చేయాలని సరూర్‌నగర్‌ సబ్‌రిజిస్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి... ఆమెపై దాడి చేశారని పేర్కొన్నారు. తను చెప్పినట్లు వినకపోతే తప్పుడు కేసులు బనాయిస్తానని బెదిరించారని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

బతుకమ్మ ఆడుతున్న మహిళలపై సుభాష్‌ దాడి చేసి... అసభ్య పదజాలంతో దూషించగా ఇదివరకే కేసు నమోదైందని వెల్లడించారు. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. సుభాష్​పై పీడీ చట్టం నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: అత్యాచారం జరిగిన 17ఏళ్లకు ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.