ETV Bharat / crime

పేకాట స్థావరంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు

author img

By

Published : Mar 8, 2021, 2:53 AM IST

వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో జరిగింది.

playing cards at inavolu Eight members arrested
పేకాట స్థావరంపై దాడి.. ఎనిమిది మంది అరెస్టు

వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.

ఆ దాడుల్లో 35 వేల రూపాయల నగదు, ఒక స్వైపింగ్ మిషన్, ఓ కారు, మూడు ద్విచక్ర వాహనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు జఫర్ గడ్ మండలానికి చెందిన క్యాత శంకర్ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ నంధీరామ్ నాయక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఐనవోలు పోలీసులకు అప్పగించినట్లు వారు వివరించారు.

వరంగల్ రూరల్ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.

ఆ దాడుల్లో 35 వేల రూపాయల నగదు, ఒక స్వైపింగ్ మిషన్, ఓ కారు, మూడు ద్విచక్ర వాహనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరు జఫర్ గడ్ మండలానికి చెందిన క్యాత శంకర్ పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ నంధీరామ్ నాయక్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీని తదుపరి చర్యల నిమిత్తం ఐనవోలు పోలీసులకు అప్పగించినట్లు వారు వివరించారు.

ఇదీ చూడండి : వాహనం పల్టీ.. ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.